టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మూవీ అల్లుఅర్జున్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ మూవీ. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మూవీపై ఇండస్ట్రీలోనూ, ఫ్యాన్స్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే, ఈ మూవీకి సంబంధించిన ఆడియో రిలీజ్ పై క్లారిటి వచ్చేసింది. దానికి సంబంధించిన న్యూస్ ని ప్రత్యేకంగా మీకు అందిస్తున్నాం. సన్నాఫ్ సత్యమూర్తి ఆడియోను మార్చి 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. దాదాపు ఈ డేట్ కన్ఫర్మ్ అయినట్టే అని టాక్స్ వినిపిస్తున్నాయి.

దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. దేవి, త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలయికలో వచ్చిన ‘జులాయి’ ఆడియో పెద్ద హిట్టయ్యింది. అల్లు అర్జున్ – దేవి శ్రీ, త్రివిక్రమ్ – దేవి శ్రీలది కూడా హిట్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా ఆడియోపై మంచి అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతుంది. అల్లు అర్జున్ సరసన సమంత, నిత్యా మీనన్, అదా శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, ఉపేంద్ర, ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: