ఎట్టకేలకు రాంచరణ్ తల్లి వేట ఫలించింది. అయితే అనూహ్యంగా ఎంపిక అయిన ఆమె చిరంజీవి హీరోయిన్ కావడం విశేషం. చిరంజీవికి మెగా స్టార్ గా ఒక వెలుగు వెలుగొందుతున్న రోజులలో ఆమె చిరూ పక్కన నటించింది. జాతీయ ఉత్తమనటి అవార్డు గ్రహీతగా క్లాసికల్ డాన్సర్ గా ఆమె యిప్పటికీ ఎన్నోప్రదర్శనలు ఇస్తోంది.

మాజీ హీరోయిన్ శోభన చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నసినిమాకు అనేక తర్జనభర్జనలు తరువాత ఈ తల్లి పాత్రకు ఎంపిక అయింది అని టాక్. దీనితో అమ్మ పాత్రలు చేసే లిస్టులో శోభన కూడా వచ్చి చేరింది. నాగార్జున హీరోగా పరిచయమైన ‘విక్రమ్‌’ సినిమాతో టాలీవుడ్‌ లో శోభన ఎంట్రీ ఇచ్చి అనేక మంది టాప్ హీరోలతో చేసింది.

ఇప్పటికి సినిమాలలో నటిస్తున్న శోభన లేటెస్ట్ గా రజినీకాంత్ 'కొచ్చాడియాన్'లోనూ గెస్ట్ రోల్ చేసింది. ఇవేకాకుండా అప్పుడప్పుడు ఈవెంట్స్‌లో నృత్య ప్రదర్శనలు చేస్తుంది. ఇప్పటికీ అవివాహితగానే ఉన్న శోభన ఓ పాపను దత్తత చేసుకొని పెంచుకుంటోంది అని టాక్. శ్రీను వైట్ల డైరెక్షన్లో మార్చిలో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ మూవీకి " మై నేమ్ ఈజ్ రాజు " అనే టైటిల్ పెట్టినట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

ఈ మూవీలో మదర్ రోల్‌కు ప్రాముఖ్యత్ ఉండడంతో రెగ్యులర్ ఆర్టిస్ట్స్‌కు డిఫరెంట్‌గా ఎవరైనా నటిస్తే బెటర్ అని ఆలోచించి శోభనను ఎంపిక చేశారు అని టాక్. గతంలో చిరంజీవి జంటగా ‘రౌడీ అల్లుడు’, ‘రుద్రవీణ’ సినిమాల్లో నటించిన శోభన ఈ కొత్త తల్లి పాత్రలో నటించి మెప్పించ గలిగితే మళ్ళీ ఆమెకు సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అనే అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: