టాలీవుడ్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తనకి తెలుగులో ఆఫర్స్ అంతగా రాకపోయినప్పటికీ, కోలీవుడ్ లో మాత్రం తనదైన శైలిలో దూసుకుపోతుంది. ‘బస్ స్టాప్’, ‘గ్రీన్ సిగ్నల్’ మరియు వరుణ్ సందేశ్ ‘ప్రియతమా నీవచట కుశలమా’ సినిమా ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన రక్షిత, తమిళనాట కూడా బాగా పాపులర్ అవుతుంది.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాయల్’ సినిమాతో రొమాంటిక్ విజయాన్ని సాధించింది. దీంతో పలు తమిళ మూవీల్లో రక్షిత సూపర్ ఆఫర్స్ ని అందుకుంటుంది. హాసిని గా ఉన్న తన పేరుని తెలుగులో రక్షితగానూ,

అలాగే తమిళ్ లో ఆనందిగా మార్చుకుని తమిళ ప్రముఖ బ్యానర్ లలో మంచి మంచి చిత్రాలలో నటించింది. ఇప్పుడు కాయల్ విజయం తరువాత నటుడు కమ్ సంగీత దర్శకుడు అవతారమెత్తిన జీ.వి ప్రకాష్ కుమార్ కు జంటగా

‘త్రిష ఇలియానా నయనతార’ సినిమాలో నటించనుంది. స్వాతీ, శ్రీ దివ్య, బిందుమాధవిల జాబితాలోకి ఇప్పుడు హాసిక కూడా చేరిందని అంటున్నారు.మొత్తానికి కోలీవుడ్ లో సత్తా చాటుతున్న ఈ బ్యూటీని చూస్తుంటే, ఇతర హీరోయిన్స్ కూడ కోలీవుడ్ లో ఆఫర్స్ కోసం వెతక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: