బిటౌన్ ఫిల్మ్ ఇండీస్ట్రీలో టాప్ హీరోయిన్స్ కనీసం ఓ డజను మంది బాయ్ ప్రెండ్స్ ఉంటారు. వారు కూడ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే. ఇదిలా ఉంటే, తాజాగా కరీనా కపూర్ తన బాయ్ ప్రెండ్ కి సంబంధించిన ఓ గిప్ట్ ని అమ్మేసుకొని, పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించుకుందనే టాక్ బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ క్లియర్ గా వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే, బాలీవుడ్ కలల రాణి కరీనా కపూర్ ఒక సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలియదు గానీ... ఆమె ప్రాపర్టీకి మాత్రం మాంచి గిరాకీ తగిలింది. ముంబైలోని తన 2050 ఎస్‌ఎఫ్‌టీ బిగ్ ఫ్లాట్‌ను దాదాపు పదిహేను కోట్ల రూపాయలకు అమ్మిందట.

అయితే ఆ ప్లాట్స్ ని ఒకప్పుడు తన పాత బాయ్ ప్రెండ్ రణ్ భీర్ కపూర్, తనకి బహుమతిగా ఇచ్చాడు. అప్పుడు రణ్ భీర్ కపూర్, 7 కోట్ల రూపాయలతో ఇచ్చిన రెండు ప్లాట్స్ ని, దాదాపు డబుల్ రేట్ కి కరీనా అమ్మింది. నిజానికి ఈ రెండు ఫ్లాట్లు. ఒకటి కరీనాది. ఇంకోటి ఆమె తల్లిది. పక్కపక్కనే ఉన్న ఈ ఫ్లాట్స్‌ను కలిపేసి విశాలంగా మలుచుకున్నారు.

రేటు భారీగా ఉండటం వల్ల మూడేళ్ల కిందటే అమ్మకానికి పెట్టి, ఇప్పుడే డీల్ సెట్ చేసుకుంది. రణ్ భీర్ కపూర్ ని కరీనా పూర్తిగా దూరం పెట్టడంతో, ఇక రణ్ భీర్ ఇచ్చిన ప్రాపర్టీస్ ని లాంటి గిప్ట్స్ ని అమ్ముకునే పనిలో పడింది కరీనా. దీంతో ఇన్ని రోజులు వెయిట్ చేసినా అనుకున్న అమౌంట్ వచ్చినందుకు కరీనా ఖుషీగా ఉందట!

మరింత సమాచారం తెలుసుకోండి: