తెలుగు చిత్ర సీమలో ఇప్పటి వరకు ఎవరూ చేయని వినూత్న ప్రయోగం చరిత్రకు అద్దం పట్టే కాకతీయుల చరిత్ర ను దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రుద్రమదేవి సినిమా థియేటర్ ట్రయలర్ ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఇప్పటికే ఈ ట్రయిలర్ గురించి ఎన్నో విషయాలు చర్చకు వచ్చాయి ఈ ట్రయలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.

ఇటీవలే రుద్రమదేవి పోస్టర్లను విడుదల చేయగా, అవి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి. దాంతో సినిమా మీద అంచనాలు కూడా బాగా పెరిగాయి. ఈ సినిమాలో రుద్రమదేవి పాత్రలో అనుష్క నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్రలో ఆమె పూర్తిగా ఇమిడిపోయిందని పాత్ర ఔన్నత్యానికి తగిన న్యాయం చేసిందని దర్శకుడు గుణశేఖర్ తెలిపారు. అల్లు అర్జున్, రాణా అద్భుతంగా నటించారని ఆయన చెప్పారు.

తెలుగు సినిమాల్లో మొట్టమొదటి 3డి పౌరాణిక సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమాలో ఇంకా రాణా, అల్లు అర్జున్, నిత్యామీనన్, కేథరిన్ తదితరులు నటిస్తున్నారు. రుద్రమదేవి సినిమా థియేట్రికల్ ట్రయలర్ ను 2డిలో విడుదల చేసినట్లు సినిమా నిర్మాతలు తమ అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు.

. .

మరింత సమాచారం తెలుసుకోండి: