ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ కి ఓ విషయం సవాల్ గా మారుతంది. గతంలో ఓ మూవీని డైరెక్టర్ తీసేసి చేతులు దులుపుకుంటాడు. అదే తన పని అనుంటారు. ఇక రిలీజ్ కి సంబంధించిన విషయాలు, మూవీ బిజినెస్ కి సంబంధించిన విషయాల్లో డైరెక్టర్ ఏ మాత్రం ఇన్వాల్వ్ అవ్వడు. ఇప్పటికీ ఇదే రిపీట్ అవుతుందనుకోండి. కాని పెద్ద దర్శకుల విషయాల్లో మాత్రం పూర్తి రివర్స్ అవుతుంది. బడా డైరెక్టర్ మూవీలను తీయడమే కాకుండా, ఆ మూవీకి సంబంధించిన బిజినెస్ వ్యవహారాల్లోనే వారి ప్రతిభ చూపుతున్నారు.

ఆ విధంగానే రీసెంట్ గా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ సన్నాఫ్ సత్యమూర్తి శాటిలైట్ రైట్స్ వ్యవహారంలో త్రివిక్రమ్ కీ రోల్ ప్లే చేశాడు. వివరాల్లోకి వెళితే, అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి'. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ భారీ ధరకు ‘మా టీవీ' ఛానల్ దక్కించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఛానల్ వారు ఏకంగా రూ. 9.5 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. బన్నీ, త్రివిక్రమ్ సినిమాలకు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉండటంతో ఇంత పెద్ద ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

గతంలో జులాయి మూవీని కొన్న మా టివి. ఇప్పుడు కూడ త్రివిక్రమ్-బన్నీల కాంబినేషన్ మూవీకి ఆసక్తి చూపింది. అయితే మొదట 8 కోట్ల రూపాయలకు మాటివి ఇష్టం చూపిన అనంతరం, త్రివిక్రమ్ తన ఇమేజ్ ని చూపించి, దానిని 9.5 కోట్ల వరకూ తీసుకుపోయి, నిర్మాతను హ్యాపీ చేసినట్టు తెలుస్తుంది.

సన్నాఫ్ సత్యమూర్తి మూవీకి బడ్జెట్ భారీ ఉండటంతో, మూవీకి సంబంధించిన బిజినెస్ వ్యవహారాల్లోనూ లాభాలను తెచ్చే విధంగా త్రివిక్రమ్ ఆలోచించి, బడ్జెట్ విషయంలో సేఫ్ జోన్ లోకి వెళుతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్ర‌స్తుతం స్పెయిన్ లో పాట‌ల చిత్రీక‌ణ జ‌రుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తో ఒక్క పాట షూటింగ్ మిన‌హ షూటింగ్ మెత్తం పూర్త‌వుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: