మంచు కుటుంబంలో ఈరోజు జరుగుతున్న శుభాకార్యo మరో సంచలనానికి తెరతీయ బోతోంది. మెగా కుటుంబ హీరో వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమా ప్రారంబోత్సవ ముహూర్తానికి చిరంజీవి పవన్ లు వచ్చిన తరువాత మరి ఏ ఫంక్షన్ లోను వారిద్దరూ ఒకరికొకరు ఎదురు పడలేదు. అయితే చాల కాలం ఈరోజు జరగబోతున్న మంచు మనోజ్ ప్రణతిల నిశ్చితార్థ వేడుకలు పవన్ చిరంజీవిలను కలపబోతున్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈరోజు జరగబోతున్న మంచు కుటుంబంలోని మనోజ్ నిశ్చితార్ధ వేడుకలకు స్వయంగా వస్తామని చిరంజీవి పవన్ లు మాట ఇచ్చారు అని ఫిలింనగర్ టాక్. అంతేకాదు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, కమలహాసన్, బాలకృష్ణ, దాసరి లతో పాటు తెలుగు తమిళ సినిమా రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు మంచు మనోజ్ నిశ్చితార్థ వేడుకలకు ఈరోజు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్టార్ హోటల్ లో ఈ వేడుకలు అత్యంత ఘనంగా మంచు కుటుంబం నిర్వహిస్తోంది. సినిమా రంగానికి చెందిన ప్రముఖులే కాకుండా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన అనేక మంది నాయకులు ఉన్నతాధికారులు కూడా ఈ వేడుకలలో పాలుపంచుకోబోతూ ఉండటం మోహన్ స్థాయిని తెలియచేస్తోంది.

వినపడుతున్న వార్తల ప్రకారం మంచు వారి పెళ్ళి నిశ్చితార్ధ వేడుకలలో పవన్ చిరంజీవిలు ఒకరికి ఒకరు ఎదురైతే ఇక మీడియా కెమెరాలకు పండుగతో కూడిన హాట్ న్యూస్ అనుకోవాలి. ఇప్పటకే రామ్ చరణ్ తో తన సొంత నిర్మాణ సంస్థ పై సినిమాను తీస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించిన పవన్ మోహన్ బాబు ఆహ్వానం మేరకు నిజంగా మనోజ్ నిశ్చితార్థ వేడుకలకు వస్తే మెగా బ్రదర్స్ ఇద్దరినీ కలిపిన ఘనత మోహన్ బాబుదే అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: