నందమూరి సింహం బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లయన్ ఆడియో వేడుక తేది ఖరారు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఆడియో వేడుక తేదీని ఖరార్ చేయడంలో బాలకృష్ణ ఒక ట్విస్ట్ ఇచ్చాడు అని ఫిలింనగర్ లో వార్తల హడావిడి వినిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ఇంచుమించు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం చాల వేగవంతంగా జరుగుతోంది

ముందుగా బాలయ్య గత సంవత్సరం బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ‘లెజెండ్’ రిలీజ్ డేట్ అయిన మార్చి 28న 'లయన్' రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. కాని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ డబ్బింగ్ పనులు పూర్తి కాక పోవడంతో ఈ సినిమా విడుదలను ఏప్రియల్ కు వాయిదా వేసారనే వార్తలు వస్తున్నాయి. అయితే బాలకృష్ణ తన ‘లెజెండ్’ సెంటిమెంట్ మిస్ కాకుండా ఇదే మార్చి 28కి ‘లయన్’ ఆడియో వేడుక జరపాలని బాలయ్య యూనిట్‌కు సూచించాడని వార్తలు వస్తున్నాయి.

ఆరోజున 'లెజెండ్' ప్రొద్దుటూరులో 365 రోజుల ప్రదర్శన కూడా పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈరెండు సందర్భాలను కలుపుకుని లయన్ ఆడియో వేడుక అత్యంత ఘనంగా తన అభిమానుల మధ్య జరుపు కోవడానికి బాలకృష్ణ ఒక యాక్షన్ ప్లాన్ రచించాడని టాక్.

ఈ వార్తలు ఇలా ఉండగా బాలయ్య తాజాగా తన హిందూపురం నియోజక వర్గంలో మoత్రులతో కూడి చేసిన పర్యటనలలో కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయానికి తన స్పందనను తీవ్రమైన కోపంతో తెలియ చేస్తూ తన బ్లాక్ బస్టర్ ‘లెజండ్’ సినిమాలోని డైలాగ్స్ చెపుతూ కేంద్ర ప్రభుత్వం పై సెటైర్లు వేస్తున్నప్పుడు హిందూపురం ప్రజలు బాలయ్యకు బ్రహ్మరధం పట్టారు. అందుకే సింహం ఎక్కడ ఉన్నా దానివిలువ మరెవ్వరికి సాటిరాదు అంటారు..

మరింత సమాచారం తెలుసుకోండి: