బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు ఈ సారి ఏకంగా అమర గాయకుడు ఘంటసాలను టార్గెట్ చేస్తూ ఉండటం టాలీవుడ్ కు షాకింగ్ న్యూస్ గా మారింది. ఇప్పటికే ఎంతోమంది టాప్ హీరోలను పేరడీ చేసిన సంపూ ఒక లేటెస్ట్ సినిమాలో ‘డాన్ ఘంటసాల’ గా కనపడబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఫిలింనగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’ అనే క్రైం కామెడీ మూవీలో సంపూ ఇలా ‘డాన్ ఘంటసాల’ గా ప్రేక్షకులను బెదరగొట్ట బోతున్నాడు అని టాక్.

ప్రస్తుతం ఈ బర్నింగ్ స్టార్ ‘కొబ్బరి మట్ట’ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్ గా సంపూ అల్లరి నరేష్ తో కలిసి నటించిన ‘బందిపోటు’ పరాజయంతో సంపూ కూడా కొద్దిగా షాక్ అయ్యాడు అని వార్తలు వస్తున్నాయి.

దీనికి కారణం ‘బందిపోటు’ సినిమాలో సంపూర్నేష్ మొట్టమొదటిసారిగా హీరోతో సమానంగా ఒక పెద్ద పాత్రను చేసినా వెండి తెర పై సంపూ నటన పెద్దగా ఎవ్వర్నీ నవ్వించలేక పోయింది. ఈ పరిస్థుతులలో త్వరలో విడుదల కాబోతున్న ‘కొబ్బరి మట్ట’ విజయం పై మాత్రమే ఈ బర్నింగ్ స్టార్ కెరియర్ టాలీవుడ్ లో ఆధారపడి ఉంది అన్నది వాస్తవం..

మరింత సమాచారం తెలుసుకోండి: