ఈరోజు ఉదయం మంచు మనోజ్ ప్రణితిల నిశ్చితార్ధ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు వరకు అనేక మంది సినిమా రంగానికి రాజకీయ రంగానికి చెందిన ఎందరో ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని మనోజ్ ప్రణితిలను ఆశీర్వదించారు.

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మనోజ్ ని ఆశీర్వదించడమే కాకుండా మంచు లక్ష్మి కుమార్తెను ఎత్తుకుని ముద్దు పెట్టుకోవడం మీడియా కెమెరాలకు హాట్ టాపిక్ గా మారింది. ఇంత ఘనంగా జరుగుతున్న ఈ నిశ్చితార్ధ వేడుకలలో ఎమోషన్ గురైన మంచు లక్ష్మి తన సోదరుడు మంచు విష్ణును కౌగలించుకుని కంట నీరు పెట్టు కోవడం ఆ ఫంక్షన్ లో ఉన్న అందర్నీ ఆశ్చర్య పరిచింది.

కొద్ది సేపటికి తేరుకున్న మంచు లక్ష్మి తాను ఆనందంతో ఇలా సంతోషాన్ని తట్టుకోలేక ఎమోషన్ కు లోనవడంతో తన కంట ఆనంద భాస్పాలు వచ్చాయని చెప్పడం మరింత ఆశ్చర్యం కలిగించింది. మంచు మనోజ్ ప్రణితిల నిశ్చితార్ధ వేడుకలకు అందంగా తయారైన పార్క్ హయత్ హోటల్ ఎందరో ప్రముఖుల సందడితో కిటకిటలాడి పోయింది.

డిజైనర్ బ్రైడల్ వేర్ ధరించి మంచు మనోజ్ - ప్రణతి రెడ్డి అందంగా మెరిసి పోయారు. ప్రణతి రెడ్డి తన పట్టుచీరలో అందమైన కుందనపు బొమ్మలా మెరిసి పోయింది. ఏది ఎలా ఉన్నా మంచు వారి నిశ్చితార్ధ వేడుకలలో మంచు లక్ష్మి కంట తడి అందరికీ హాట్ టాపిక్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: