బలుపు, పవర్ వంటి వరుస సూపర్ హిట్ చిత్రాల త‌రువాత మాస్ మహరాజ్‌ రవితేజ హీరోగా, మిల్కి బ్యూటి త‌మ‌న్నా, స్మైలింగ్ సుంద‌రి రాశి ఖ‌న్నాలు క‌ధానాయిక‌లుగా, రచ్చ వంటి బ్లాక్ బస్టర్ హిట్ త‌రువాత సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న బెంగాల్ టైగ‌ర్ ఇటీవ‌లే పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ఆర్‌.ఎఫ్.సి లో ప్రాంభ‌మైంది. ఈ నెల 14 వ‌ర‌కూ ఈ షెడ్యూల్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. ఈ చిత్రాన్ని ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని అందించిన అభిరుచి గల నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా రవితేజ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ.... ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి మోస్తరు బడ్జెట్ చిత్రాలు నిర్మించిన నాకు మాస్ మహారాజ రవితేజ అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సంప‌త్ నంది ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. కథకు తగ్గట్టుగా బెంగాల్ టైగర్ టైటిల్ పెట్టాం. టైటిల్ కు తగ్గట్టుగానే హీరో క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశాం. అందాల భామలు తమన్నా, రాశిఖ‌న్నా లు రవితేజతో జోడీ కడుతున్నారు. అత్తారింటికి దారేది చిత్రం త‌రువాత బాలీవుడ్ న‌టుడు బోమ‌న్ ఇరాని ఎన్నో క‌థ‌లు విన్నాకూడా ఎంతో సెల‌క్టివ్ గా వుండే ఆయ‌న మా చిత్రంలో చేస్తున్నారు. ప్ర‌స్తుతం రామోజి ఫిల్మ్ సిటి లో మా బెంగాల్ టైగ‌ర్ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. బోమ‌న్ ఇరాని, రాశిఖ‌న్నా, షియాజి షిండే లతో పాటు ముఖ్య‌తారాగణం పై కొన్ని సీన్స్ చిత్రీక‌రిస్తున్నారు. ఈ నెల 14 వ‌ర‌కూ ఈ షెడ్యూల్ జ‌రుగుతుంది. అని అన్నారు.

దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ... మాస్ మహరాజ్ రవితేజతో సినిమా చేయాలన్న నా కోరిక ఈ సినిమాతో తీరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమాల మీద అభిరుచి ఉన్న నిర్మాత కె కె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్తారింటికి దారేది లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంలో న‌టించిన బాలీవుడ్ బెస్ట్ ఆర్టిస్ట్ బోమ‌న్ ఇరాని రెండ‌వ చిత్రంగా మా చిత్రం లో ప్ర‌స్తుతం న‌టిస్తున్నారు. రామోజిఫిల్మ్ సిటిలో బోయ‌న్ ఇరాని పై కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నాము. మార్చి 14 వ‌ర‌కూ ఈ షెడ్యూల్ జ‌రుగుతుంది.. అని అన్నారు.

ఈ చిత్ర‌లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి తదిత‌రులు న‌టించ‌గా..బ్యాన‌ర్‌..శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌ కెమోరా.. సుంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌.. గౌత‌మ్‌రాజు, ఆర్ట్‌.. డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌.. రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, నిర్మాత‌..కె.కె.రాథామెహ‌న్‌, క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం.. సంప‌త్ నంది

మరింత సమాచారం తెలుసుకోండి: