రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన జేడి చక్రవర్తి టాలీవుడ్ కు పరిచయం అయి 25 సంవత్సరాలు దాటిపోయాయి. ఇన్నిసంవత్సరాలు గడిచినా నటుడు, దర్శకుడు జేడి చక్రవర్తికి మంచి పేరు అయితే వచ్చింది కాని టాలీవుడ్ లో ఉన్నత స్థానానికి ఎదగలేకపోయాడు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి అని అంటారు.

టాలీవుడ్ నుండి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు ఫైనల్‌గా కోలీవుడ్‌లో సెటిలైన ట్లుగా కనిపిస్తోంది. జేడి లేటెస్ట్ గా ఈమధ్య 'ఐస్ క్రీమ్ 2' లో నటించినా ఆ సినిమా విజయవంతం కాకపోవడంతో జెడికి ఆరోల్ అంతగా వర్కౌట్ కాలేదు. జగపతిబాబు, శ్రీకాంత్, బ్రహ్మానందం లతో నాలుగైదు సినిమాలు డైరెక్ట్ చేసినా దర్శకుడిగా కూడ జేడి చక్రవర్తి సెటిల్ కాలేకపోయాడు.

అయితే ఇతడికి లేటెస్ట్ గా నయన తారను ప్రేమించే రోల్ దక్కింది. ఈ సినిమాను మలయాళంలో తీయబోతున్నారు. ‘భాస్కర్ ది రాస్కెల్’ టైటిల్‌తో రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ మూవీకి హీరో మమ్ముట్టి. అయితే జే.డీ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ చేస్తునే నయనతారను ప్రేమించే పాత్ర అని టాక్.

హిట్లర్, బాడీగార్డ్ ఒరిజినల్ వెర్షన్ ఫేం సిద్దిక్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. నయన తార తనకు ఎప్పటి నుంచో పరిచియం కాబట్టి ఆమెతో నటించడం తనకు చాలా హ్యాపీగా ఉండని జేడి చక్రవర్తి చెపుతున్న మాటలు బట్టి నయన జేడి కెరియర్ కు మంచి ట్విస్ట్ ఇస్తోంది అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: