ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ హవా నడుస్తూ ఉండటంతో టాప్ హీరోలంతా మల్టీ స్టారర్ సినిమాలలో నటించడానికి మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే వెంకటేష్ తో ఒక మల్టీ స్టారర్ లో నటించిన మహేష్ బాబుకు ఇటువంటి సినిమాలలో నటించాలని కోరిక ఉన్నా ఒక మల్టీ స్టారర్ విషయమై నిర్ణయం తీసుకోవడానికి భయ పడుతున్నట్లు టాక్.

ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పూర్తి కాగానే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించబోతున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటించడానికి లైన్ క్లియర్ చేసాడు అనే వార్తలు ఉన్నాయి. అయితే అనుకోకుండా మహేష్ కు వచ్చిన ఒక భారీ మల్టీ స్టారర్ ఆఫర్ మహేష్ ను అయోమయంలో పడేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

తమిళంలో మోహన్ లాల్ , విజయ్ లతో ‘జిల్లా’ లాంటి హిట్ సినిమాకు దర్శకత్వం వహించిన డైరక్టర్ నీసన్ మహేష్ బాబు, మోహన్ లాల్, ఆర్యలతో కలిపి ఒక భారీ మల్టీ స్టారర్ ను తెలుగు, తమిళ, మళయాళ భాషలలో తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక భారీ నిర్మాణ సంస్థ ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

మహేష్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరిస్తే దాదాపు 25 కోట్ల భారీ పారితోషికాన్ని ఆ సినిమా నిర్మాతలు ఆఫర్ చేసినట్లు టాక్. అయితే ఈ సినిమాకు సంబంధించి మహెహ్ బల్క్ డేట్స్ కావాలని ఆ సినిమా నిర్మాతలు అడుగుతున్నారట. ఈ నేపధ్యంలో మూడు భాషలలో నిర్మాణం కాబోతున్న మల్టీ స్టారర్ లో నటించాలా లేదంటే ఒక స్ట్రైట్ తెలుగు సినిమాలో నటించాలా అన్న విషయంలో ఎటూ తేల్చుకోలేక మహేష్ ఇబ్బంది పడుతున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: