గ్లామర్ ఇండస్ట్రీలో ఒక్కోసారి కొన్ని వింత డిమాండ్స్ జరుగుతుంటాయి. ఆ విధంగానే ప్రస్తుతం కాజల్ విషయంలోనూ జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయమే, కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే, తన అందంతో, నటనతో తెలుగునాట మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కాజల్.. ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ మంచి పేరున్న విశాల్ సరసన నటించనుందనే విషయం తెలిసిందే.

గత కొంత కాలంగా కాజల్ కి బాక్సాపీస్ మార్కెట్ వద్ద సరైన సక్సెస్ లేనప్పటికీ, తనకు మాత్రం ఏ మాత్రం డిమాండ్ తగ్గటం లేదు. రీసెంట్ గా ఎన్టీఆర్‌కు జోడీగా కాజల్ నటించిన టెంపర్, ఈమధ్యే విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఆమె విశాల్ అప్ కమింగ్ ద్విభాషా చిత్రంలో నటిస్తుంది. విశాల్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఉండడంతో అతని సినిమాలు మినిమమ్ గ్యారంటీ అనే పేరును సంపాదించుకున్నాయి.

గతంలో పాండియనాడు సినిమాను విశాల్ తో రూపొందించిన టీమ్ వేంథర్ మూవీస్ సంస్థ, మళ్లీ మరో సినిమా చేస్తోంది. పాండియనాడు సినిమాను తెలుగులో పల్నాడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు పల్నాడుకు పనిచేసిన టీమ్ అంతా ఈ సినిమాకు పనిచేస్తోంది. విశాల్ సరసర హీరోయిన్ గా సెలక్ట్ అయిన కాజల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది అన్న దానిపై ఓ న్యూస్ బయటకు వచ్చింది.

ఇందుకు కాజల్ మొదట కోటి రూపాయల రెమ్యునరేషన్ ని ఫిక్స్ చేసింది. తరువాత హీరో ఎవరో తెలుసుకున్న తరవాత మరో 50 లక్షల వరకూ పెంచి, ఫైనల్ గా 1.20 కోట్ల రూపాయలకు తన రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకుందట. హోలీ సందర్భంగా ఈ సినిమాను చెట్పట్ లోని సిందూరపూవు హవుస్ లో ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: