ఓ టి.వి చానల్ ని పెడితే కోట్ల రూపాయల ప్రాఫిట్ పొందొచ్చు అనేది చాలా మంది బిగ్ షాట్స్ ల అభిప్రాయం. కాని, తీరా ఛానల్ లాంచ్ చేసిన తరువాత మార్కెట్ లోకి వెళ్ళి చూస్తే, ఒక్క రూపాయిని కూడ సంపాదించలేకపోతున్నామనే ఫీలింగ్ లో చాలా ఛానల్స్ మూత పడుతుంటాయి. ఛానల్స్ గురించి ఇంత బాగా తెలిసిన ఓ బిటౌన్ సెలబ్రిటి, తాజాగా ఓ టీ.వి చానల్ ని స్టార్ట్ చేశాడు.

వివరాల్లోకి వెళితే, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరికొత్త బిజినెస్ ప్రారంభించారు. సొంతగా టెలిషాపింగ్ టీవీ ఛానల్ ప్రారంభించారు. ‘బెస్ట్ డీల్ టీవీ' పేరుతో ఈ ఛానల్ ప్రారంభించారు. ఈ వ్యాపారంలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కూడా భాగస్వామిగా ఉన్నారు. గతంలో అక్షయ్-శిల్ప మధ్య మంచి రిలేషన్ ఉండటంతో, ఇప్పుడు ఆమె భర్తతో కలిసి అక్షయ్ కుమార్ వ్యాపార రంగంలోకి దిగడం జరిగింది.

ప్రస్తుతానికి ఈ ఛానల్ హిందీలో మాత్రమే ప్రారంభం అయింది. ఇది సెలబ్రిటీ బేస్డ్ టెలిషాపింగ్ ఛానల్. అంటే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ఛానల్ తో ఒప్పందం కుదుర్చుకని తమ సొంత బ్రాండ్లు మార్కెట్ చేసుసుకోవచ్చు. తద్వారా లాభాల్లో వాటా తీసుకొచ్చవని అంటున్నారు. తొలి సారిగా నటి సోనాక్షి సిన్హా ఈ టీవీ ఛానల్‌తో టై అప్ అయింది. దీనిపై రాజ్ కుమార్ కుంద్ర, అక్షయ్ కుమార్ ఇద్దరూ దాదాపు 300 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టు తెలిసింది.

మరి కొద్ది రోజుల్లో ఈ ఛానల్ ని అన్ని రాష్ట్రాలకు ప్రసారాలను విడుదల చేస్తారని తెలిపారు. ఈ టీవీ ఛానల్ గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ...‘టెలిషాపింగ్ బిజినెస్ వరల్డ్ లోనే అతి పెద్దది. రాజ్ కుంద్రా, నేను కలిసి కొత్త ఐడియాతో దీన్ని ప్రారంభించాము. ఇదో సెలబ్రిటీ బేస్డ్ టెలిషాపింగ్ ఛానల్. సెలబ్రిటీలు స్వయంగా వచ్చి తమ ప్రొడక్ట్స్ ఇక్కడ అమ్ముకోవచ్చు' అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: