ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో సిద్ధార్ధ్ ఫిల్మ్ కెరీర్ గ్రాఫ్ డౌన్ ఫాల్ లో ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే, తనకి తెలుగులో పెద్దగా మూవీలు లేవు. అంతే కాకుండా టాలీవుడ్ కి చెందిన పలువురు నిర్మాతలు, దర్శకులతో సిద్ధార్ధ్ కి గొడవలు ఉండటం కారణంగా తను తెలుగులో మూవీలను చేయలేకపోతున్నాడు. దీంతో సిద్ధార్ధ్ ని తెలుగు ప్రేక్షకులు చూడటం సాధ్యం కావడం లేదు.

అయితే సిద్ధార్ధ్ కి మాత్రం తెలుగులో బొమ్మరిల్లు మూవీ రిమేక్ లో నటించాలనే ఆశ ఉందట. దిల్ రాజు సైతం బొమ్మరిల్లు సీక్వెల్ ని తిరిగి సిద్ధార్ధ్, జెనీలియాతో చేయాలనుకుంటున్నాడు. అయితే తాజాగా జెనీలియా రీ-ఎంట్రికి రంగం సిద్ధం చేసుకుంటుంది. వివాహానంతరం జెనీలియా వెండితెరకు దూరమైంది. మధ్యలో రెండు సినిమాలలో అతిథి పాత్రల్లో సందడి చేసింది. కుమారుడికి జన్మనివ్వటంతో పాటు తన సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించింది.

మాతృత్వపు మాధుర్యాన్ని ఆశ్వాదించిన జెనీలియా మనసు మళ్లీ వెండి తెరపై పడినట్టుంది. నేను సినిమాలను వదిలి దూరంగా వెళ్లలేదు కాస్త విరామం తీసుకున్నా. అంతే త్వరలో తిరిగి సినిమాల్లో ఎంట్రీ ఇవ్వటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

నాకు ప్రేక్షకులకు సంతోషాన్ని కలిగించే పనులు చేయాలనుకంటున్నానని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న సిద్ధార్ధ్, జెనీలియా వద్దకు వెళ్ళి బొమ్మరిల్లు సీక్వెల్ లో నటించాలని అని దిల్ రాజు మాటగా చెప్పాడంట. అందుకు జెనీలియా సీక్వెల్ చేయటానికి ఆసక్తి లేదంటూ తెలిపేసరికి సిద్ధార్ధ్ కొద్దిగా పీల్ అయినట్టు టాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: