ఈ మధ్య టాలీవుడ్ కు అస్సలు కలిసి రావడం లేదు. ప్రముఖ నటులు ఆకస్మకింగా చనిపోవడం. అనారగోగ్యంతో భాదపడటం. తెలుగు ఇండస్ట్రీని ఒక రకంగా కలిచి వేస్తున్న సంఘటనలు. తాజాగా ప్రముఖ నటి ఊర్వశి శారద నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామం వద్ద కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో ఆమెకు దెబ్బలు బాగానే తగిలాయట వెంటనే వేరే కారు సహాయంతో హైదరాబాద్ కు తరలించారు. కాగా ఈ రోడ్డు ప్రమాదాలకు నెలవైన స్థలం. గతంలో నందమూరి జానకి రామ్ కూడా ఈ రోడ్డు మీద నుంచి వస్తుంటేనే ప్రమాదానికి గురై మృతి చెందారు.

హైదరాబాద్ లో జరగనున్న షూటింగ్ లో పాల్గొనేందుకు నటీ శారద శుక్రవారం విజయవాడ నుంచి కారులో హైదరాబాద్ బయలుదేరారు. ఆ క్రమంలో నల్గొండ జిల్లా ఆకుపాముల గ్రామం వద్ద వేగంగా వెళ్తున్న కారుకు గేదలు ఒక్కసారిగా అడ్డు వచ్చాయి. ఆ క్రమంలో డ్రైవర్ కారును పక్కకు తప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో శారద స్వల్పంగా గాయపడ్డారు.

. .

మరింత సమాచారం తెలుసుకోండి: