హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలను చేస్తున్న అనుష్క హీరోలను అనుసరిస్తూ నిర్మాతలను ఆదుకునే పనులు చేపడుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పివీపి బ్యానర్ కు అనుష్క చేస్తున్న సహాయం ఇప్పుడు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. నిర్మాతలు దగ్గర కోట్ల రూపాయలు పారితోషికాలుగా ఎలా తీసుకోవాలి అని హీరోయిన్స్ ఆలోచిస్తున్న నేపధ్యంలో అనుష్క చేపట్టిన కొత్త పద్ధతి కొత్త సాంప్రదాయానికి తెర తీసింది.

బాహుబలి, రుద్రమదేవి వంటి సినిమాలతో బిజీగా వున్న అనుష్క ఆ సినిమాల షూటింగ్ పార్ట్ పూర్తి కావడంతో ఈమధ్యే సైజ్ జీరో అనే మూవీకి సైన్ చేసింది అన్న విషయం తెలిసిందే. పీవీపీ బ్యానర్‌పై పొట్లూరి వరప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆర్య, అనుష్క ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా కోసం ఆర్య, అనుష్క ఇద్దరూ ఎప్పటికన్నా తక్కువ పారితోషికం తీసుకుని ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారు అని టాక్. గతంలో ఇదే నిర్మాణ సంస్థ వీరిద్దరితో నిర్మించిన ‘వర్ణ’ పివీపి సంస్థకు భారీ నష్టాలను మిగిల్చింది.

ఈ కారణంతో తిరిగి వీరిద్దరూ పివీపి సంస్థకు కలిగిన నష్టాలను తగ్గించడానికి ఈ ‘సైజ్ జీరో’ సినిమాలో తక్కువ పారితోషికానికి ఒప్పుకున్నట్లు ఫిలింనగర్ టాక్. ఈ కొత్త ఓరవడి భారీ సినిమాల నిర్మాతలకు మంచి జోష్ ఇచ్చే వార్తగా మారుతుంది అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: