టాలీవుడ్ ‘లయన్’ బాలకృష్ణ ఒక చిన్న సినిమాను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్ చేస్తున్నాడు. నిర్మాత సాయి కొర్రపాటికి తనకూ ఉన్న సాన్నిహిత్యంతో బాలకృష్ణ ‘తుంగభద్ర’ సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నాడు. ఈసినిమా ఈ వారం విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

రాజమౌళికి సన్నిహితుడిగా పేరుగాంచిన సాయి కొర్రపాటి ‘ఈగ’ సినిమా తరువాత వరస పెట్టి చిన్న సినిమాలు తీస్తున్నాడు ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి ఇప్పటికే అనేక విజయాలు అందుకున్నాడు.

బాలకృష్ణతో ‘లెజెండ్’ సినిమా తీసిన తరువాత బాలయ్యతో సాన్నిహిత్యం పెంచుకున్న సాయి కొర్రపాటి తాను లేటెస్ట్ గా నిర్మిస్తున్న ‘తుంగభద్ర’ సినిమాను బాలయ్యకు స్పెషల్ షోగా వేసి చూపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా బాలకృష్ణకు బాగా నచ్చడంతో ఈ సినిమా పై బాలయ్య ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.

ఈ సినిమాతో శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు అదిత్, డింపుల్ చోప్డా, సత్యరాజ్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే పాజిటివ్ టాక్ ఉంది. ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు అనుకోని విజయాలు సాధిస్తూ ఉండటంతో ఈ సినిమా కూడా విజయవంతం కావచ్చు అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: