ఎన్నో పాత్రలను పోషించిన బాలకృష్ణ నిజజీవితంలో తాతయ్య అయ్యాడు. నారా, నందమూరి కుటుంబాలకు మన్మథసంవత్సరం వస్తూనే ఆనందాలను తెచ్చి పెట్టింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులకు మగశశివు జన్మించాడు.
హైదరాబాదులోని మాదాపూర్లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి నిన్న ఉగాది నాడు మగ బిడ్డకు జన్మ నిచ్చింది . మన్మథనామ సంవత్సరం విదియ తిథిన లోకేష్, బ్రాహ్మణి దంపతులకు కుమారుడు జన్మించాడు.
రేవతి నక్షత్రం రెండో పాదంలో బాలయ్య మనవడు పుట్టడంతో నందమూరి సింహం మంచి జోష్ మీద ఉన్నాడు .
కర్కాటక లగ్నం మీనరాశిలో బాలయ్య మనవడు పుట్టాడు అని జ్యోతిష్కులు చెపుతున్నారు.
బాలకృష్ణ చంద్రబాబులు తాతలు కావడంతో ఎన్టీఆర్
ట్రస్ట్ భవన్లో నాయకులు, కార్యకర్తలు
ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుంటున్నారు. ఏదిఎలా ఉన్నా ఉగాది
పండుగ బాలయ్యకు మంచి బహుమతిని ఇచ్చింది.