ఎన్నో పాత్రలను పోషించిన బాలకృష్ణ నిజజీవితంలో తాతయ్య అయ్యాడు. నారా, నందమూరి కుటుంబాలకు మన్మథసంవత్సరం వస్తూనే ఆనందాలను  తెచ్చి పెట్టింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులకు మగశశివు జన్మించాడు.


 హైదరాబాదులోని మాదాపూర్‌లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాలకృష్ణ  కుమార్తె  బ్రాహ్మణి  నిన్న ఉగాది నాడు  మగ బిడ్డకు జన్మ నిచ్చింది . మన్మథనామ సంవత్సరం విదియ తిథిన లోకేష్, బ్రాహ్మణి దంపతులకు కుమారుడు జన్మించాడు.

 

రేవతి నక్షత్రం రెండో పాదంలో బాలయ్య మనవడు  పుట్టడంతో నందమూరి సింహం మంచి జోష్ మీద ఉన్నాడు . కర్కాటక లగ్నం మీనరాశిలో బాలయ్య మనవడు  పుట్టాడు అని జ్యోతిష్కులు చెపుతున్నారు. బాలకృష్ణ చంద్రబాబులు తాతలు కావడంతో  ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో నాయకులు, కార్యకర్తలు ఒకరికి  ఒకరు  స్వీట్లు తినిపించుకుంటున్నారు. ఏదిఎలా ఉన్నా ఉగాది పండుగ బాలయ్యకు మంచి  బహుమతిని ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: