నిన్న
వరంగల్ లో జరిగిన ‘రుద్రమదేవి’ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా అల్లుఅర్జున్ చేసిన
వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్య పరచడమే కాకుండా ఈ కామెంట్స్ తో మెగా కుటుంబం దాసరి పై
డైరెక్ట్ వార్ కు దిగింది అన్న సంకేతాలు కలిగించాయి. ‘ఎవరినైనా బాధ పెట్టడం చాల సులువు, కానీ వారి మనసులలోకి వెళ్ళడం కష్టం’
అన్న మాటలు తన మామయ్య చిరంజీవి తనతో చెపుతూ ఉంటారని ఆ మాటలనే తను అనుసరిస్తున్నాను
అంటూ కామెంట్స్ చేసాడు బన్నీ.
బన్నీ నోటి వెంట ఈ మాటలు విన్న చాలామంది ఈమధ్యన దాసరి ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియో వేడుకలో చిరంజీవిని మనసులో పెట్టుకుని చేసిన కామెంట్స్ కు బన్నీ ఈ విధంగా దాసరిని అన్యాపదేశంగా తన మాటలతో టార్గెట్ చేసాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు విశ్లేషకులు.
నిన్న వరంగల్ లో అత్యంత ఘనంగా జరిగిన ఈ సినిమా ఆడియో వేడుకలో ‘రుద్రమదేవి’ యూనిట్ అంతా పాల్గొంది. ఇదే సందర్భంలో అల్లుఅర్జున్ ఇంకా మాట్లాడుతూ ఈ సినిమాకు అనుష్క లేనిదే ‘రుద్రమదేవి’ లేదని కేవలం తామంతా ఈ సినిమాలో సహనటులం మాత్రమే అని అల్లుఅర్జున్ కామెంట్ చేయడం అతని సంస్కారానికి నిదర్సనం అంటూ కామెంట్స్ వినపడ్డాయి..