టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాల మధ్య సరైన మాటలు లేవనేది, ఇండస్ట్రీలో వినిపించే ఓపెన్ టాక్. అలాంటి వాటిలో మెగాస్టార్ చిరంజీవి, అలాగే దాసరినారాయణ రావు మధ్య సత్సంబంధాలు ఉన్న మాట నిజమే. కాని కొన్ని అధికారాలు, కొన్ని పద్ధతుల విషయంలో వీరిద్దరి గొడవ రాజుకుంటూనే వస్తుంది.
తాజాగా బన్ని నటించిన సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్ లో మెగా ఫ్యామిలీలోని అందరిని పొగుడుతూ వచ్చిన దాసరి, ఒక్క చిరంజీవిని, రామ్ చరణ్ ని మాత్రం మర్చిపోయాడు. అంతే కాకుండా తను మాట్లాడిన తీరు ఇండైరెక్ట్ గా చిరంజీవిని టార్గెట్ చేసి మాట్లాడాడు అంటూ జనాల్లోని ఆ భావన వెళ్ళింది. దీంతో సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్ తరువాతి రోజు, బండ్ల గణేష్, దాసరి వాఖ్యలపై ఇండైరెక్ట్ గా సోసిషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో టార్గెట్ చేసుకుంటూ రాశాడు.
బండ్ల గణేష్ మాటల్లో చిరంజీవి గొప్ప అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అయితే చిరంజీవి అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తుల్లో బన్ని ఒకరు. అలాంటి చిరంజీవి మీద, తన ఆడియో ఫంక్షన్ లో జరిగిన అవమానంపై అల్లుఅర్జున్, రుద్రమదేవి మూవీ ఆడియో వేధికని చేసుకొని కౌంటర్ ఇచ్చాడు.
ఎవరెన్ని
చెప్పిన చిరంజీవి తరువాతనే.
తనకు
అంటూ,
తను
ఎవరి గురించి మాట్లాడుతున్నానో
అభిమానులు అర్ధం చేసుకోగలరు
అంటూ దాసరికి చురకలు అంటించాడని
బయటకు మెసేజ్ వెళ్ళింది.
ఈ
వాక్యలపై దాసరి చాలా సీరియస్
గా ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల
సమాచారం.
బన్ని
త్వరలోనే దాసరి కౌంటర్ ఇస్తాడని
ఇండస్ట్రీలో టాక్స్
వినిపిస్తున్నాయి.