సినిమా కళాకారులు అంతా ఒకే కుటుంబం అని చెప్పుకుంటున్న నేపధ్యంలో ‘మా’ సంస్థకు జరుగుతున్న ఎన్నికలలో సినిమా ప్రపంచంలో ఎన్ని వర్గాలు ఉన్నాయో మరెన్ని ద్వేషాలు ఉన్నాయో మీడియా సాక్షిగా బయట పడుతున్నాయి. టాలీవుడ్ సినిమాలలో హాస్య పాత్రలు చేసే హేమ మెగా బ్రదర్ నాగబాబును టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఫిలింనగర్ ను కుదిపెస్తున్నాయి. 

రాజేంద్రప్రసాద్ ను బలపరుస్తున్న నాగబాబు గతంలో ‘మా’ సంస్థకు అధ్యక్షుడిగా చేసిన రోజులలో సంస్థకు 75 లక్షలతో కొనుగోలు చేసిన ఇల్లు ఈరోజు కనీసం 15 లక్షలు కూడా విలువ చేయదని కామెంట్ చేసింది హేమ. అంతేకాదు నాగబాబు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పేద సినీ కళాకారులకు చేసింది ఏమి లేదు అంటూ హేమ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని లేపుతున్నాయి.

హేమ నాగబాబును తన మాటలతో టార్గెట్ చేసిన నేపధ్యంలో ఈ కామెంట్స్ మెగా కాంపౌండ్ వరకు చేరుతాయి కాబట్టి  ఈ వ్యాఖ్యలకు దీటుగా నాగబాబు స్పందించే అవకాశం ఉంది. జరుగుతున్న పరిణామాలను బట్టి రానున్న రెండు మూడు రోజులలో ‘మా’ సంస్థ ఎన్నికలు అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: