ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు లేకపోవడంతో కోలీవుడ్ బాట పట్టి అక్కడి సినిమాలు చేసుకుంటూ రోజులు గడుపుతున్న కాజల్ తన మితిమీరిన వింత ప్రవర్తనతో కోలీవుడ్ నిర్మాతల కోపానికి గురై నోటీసులు అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 


కోలీవుడ్ మీడియా రాస్తున్న వార్తల ప్రకారం కాజల్ ప్రస్తుతం తాను నటిస్తున్న తమిళ సినిమాల షూటింగ్ కు చాల లేట్ గా వస్తూ ఉండటంతో ఆమె కోసం నిర్మాతలు మిగతా నటీనటులను కూడ బ్రతిమాలుకో వలసి వస్తోందని టాక్. దీనికి కారణం కాజల్ తమిళంలో సినిమాలు చేస్తూ మరో వైపు మరొక బాలీవుడ్ సినిమాను ఒకే సమయంలో చేస్తూ ఉండటంతో కాజల్ ఇంచుమించు ప్రతిరోజు చెన్నై ముంబాయిల మధ్య విమానంలో తిరుగుతూ ఉండటంతో సినిమాల షూటింగ్ కు ఆలస్యంగా రావడం జరుగుతోందని తెలుస్తోంది.


తమిళంలో ధనుష్ తో చేస్తున్న సినిమా విషయంలో ఈ సమస్య ఎదురైందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాతో పాటుగా బాలీవుడ్ లో రణదీప్ హుడా తో చేస్తున్న చిత్రానికి ఉదయం ఒకరికి సాయంత్రం మరొకరికి కాజల్ డేట్స్ ఇవ్వడంతో కాజల్ ఎవ్వరికి సరిగ్గా పనిచేయలేకపోతోంది అనే వార్తలు వస్తున్నాయి. దీనితో కోపగించుకున్న కోలీవుడ్ నిర్మాతల మండలి కాజల్ నుండి నష్ట పరిహారం కోరుతూ నోటీసులు ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: