ఎప్పుడైతే మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్) అద్యక్ష ఎన్నికలు మొదలైనప్పటి నుంచి వివాదాలకు తెర లేపింది. ప్రతి రోజూ ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. మురళీ మోహన్ అధ్యక్ష పదవి ఎలాంటి టెన్షన్ లేకుండా ఏకగ్రీవంగా అయినప్పటికి ప్రస్తుతం ఎలక్షన్ మటుకు పూర్తిగా భిన్నంగా ఉంది.


మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్) అధ్యక్ష పదవికి  సిద్దమైన రాజేంద్ర ప్రసాద్


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నటుడు రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన పోటీ చేస్తున్న మొదట్లో ఎలాంటి వివాదం లేనప్పటికీ ఎప్పుడైతే జయసుధ పోటీకి ఎంట్రీ ఇచ్చింది రాజేంద్రుడికి షాక్ తగిలింది. తర్వాత ఆయనకు మెగా బ్రదర్ నాగబాబు సపోర్టు ఇచ్చినప్పటికీ జయసుధ వైపు అందరి చూపు కొనసాగుతుంది.రోజు రోజుకు ఆమెకు మద్దతు బాగా పెరిగి పోతుంది.


మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్) అధ్యక్ష పదవికి సిద్దమైన  జయసుధ



 తాజాగా జయసుధను కొందరు రాజకీయ నాయకులు పోటీ నుంచి తప్పకోవాలని బెదిరిస్తున్నారంటూ చెప్పడంతో ఈమెపై మరింత సానుభూతి పెరుగుతూ వచ్చింది. తాజాగా మోహన్ బాబు కూడా జయసుధకు మద్దతు పలికాడు.  దీంతో రాజేంద్ర ప్రసాద్ కి మరో షాక్ తగిలింది. ఇదీ కాక తాజాగా   ఆయన ప్యానెల్ తరఫున శివాజీరాజా, ఉత్తేజ్ హఠాత్తుగా బుధవారం పోటీ నుంచి తప్పుకొన్నారు. దీంతో జయసుధతో అధ్యక్ష స్తానంలోకోసం పోటీపడుతున్న రాజేంద్రప్రసాద్ ఒంటరి అయ్యారు. ఆయన కు చిరంజీవి సోదరుడు నాగబాబు మాత్రమే మద్దతు ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: