మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవి పై నెలకొన్న రాజకీయ రగడపై మెగా బ్రదర్ నాగ బాబు తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇప్పటికే   రాజేంద్రప్రసాద్ కు నాగబాబు  మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. జయసుధ ప్యానెల్ చేసిన కామెంట్స్ కు సమాధానంగా రాజేంద్రప్రసాద్ ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టారు.


రాజేంద్ర ప్రసాద్ కు మద్దతు తెలుపుతూ నాగబాబు


నాగబాబు మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్‌కు ‘మా’ అధ్యక్షుడిగా పోటీచేసే అర్హత లేదని కొందరు ఎద్దేవా చేశారని ఆరోపించారు. మా అధ్యక్ష పదవికి రాజేంద్రప్రసాద్‌ పేరును ప్రకటించిన తర్వాతనే జయసుధ పేరును ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. ఎన్నికలయ్యే వరకు రాజేంద్రప్రసాద్‌కే తాము మద్దతిస్తామని నాగబాబు స్పష్టం చేశారు. ఫలితాలు ఎలా వస్తాయనేదాని గురించి ఆలోచించడం లేదన్నారు. ‘మా’కు రూ. మూడు కోట్లకు పైగా మూల నిధి ఉందని ఆ డబ్బును ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ‘మా’ సభ్యత్వ రుసుమును రూ. లక్ష చేయడం దారుణమని నాగబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆయనకున్న ఎక్స్ పీరియెన్స్ అలాంటిది.

దారుణమైన విషయమేమిటంటే... ఆర్టిస్టుల్ని బెదిరిస్తున్నారని సిల్లీగా మాట్లాడుతున్నారు. రాజకీయాలు చేస్తున్నారన్నారు. నేను వెనక్కి తగ్గేజేలేదు.   మా అసోసియోషన్ మెంబర్ షిప్ లక్ష రూపాయలు పెట్టారు. అంటే పేదవారికి గెట్లు వేసేశారా. మెడిక్లెయిమ్ నూట యాభై మంది కళాకారులకు కట్టలేరా. డబ్బులు ఏం చేస్తారు. సిగ్గు పడాల్సిన విషయం. రేపు మా ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. భయపడటం లేదు. రాజేంద్రప్రసాద్ ను అతని టీం ను గెలిచి చూపించండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: