దర్శక రత్న  దాసరి నారాయణరావు మాటలకు మెగా కుటుంబ  హీరోలు తమ సెటైర్లతో ఘాటుగా స్పందన ఇచ్చిన నేపధ్యంలో పవన్ దాసరిల సినిమా  అటకెక్కుతుంది అనుకున్నారు అంతా. అయితే అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ పవన్ సూచనతో ఈ సినిమా ప్రాజెక్ట్ స్పీడ్ అందుకుంది అన్న వార్తలు  వస్తున్నాయి. 

ప్రస్తుతం పవన్ ను పీడిస్తున్న వెన్నునొప్పి కారణంగా పవన్  హై పవర్ ఫుల్  సీన్స్ ఉండే సినిమాను చేయకుండా కామెడీ టచ్ ఉండే ఒక  ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటించాలని నిర్ణయించుకున్నట్లు టాక్.  ఈ నిర్ణయంలో భాగంగానే పవన్  తనతో ‘గోపాల గోపాల’  సినిమా తీసిన డాలీ స్క్రిప్ట్ కు ఓటు వేయడమే  కాకుండా ఈ సినిమాను దాసరి ప్రొడక్షన్ హౌస్ లో నిర్మింప చేయడానికి పనులు  వేగవంతం చేసాడు అన్న వార్తలు వస్తున్నాయి. 

కథకు సంబంధించి క్లారిటీ రావడంతో ఈ సినిమాకు డైలాగ్స్  వ్రాసే బాధ్యతను  ‘కృష్ణంవందే జగద్గురుం’, ‘గోపాల గోపాల’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ వంటి సినిమాలకు డైలాగ్స్ రాసిన సాయి మాధవ్ కు అప్పచెప్పి నట్లుగా సమాచారం. అంతేకాదు పవన్ ఈ సినిమా డైలాగ్స్  ను సాయి మాధవ్ ఎలా వ్రాయాలో తన అభిప్రాయాలను కూడా తెలియచేస్తున్నాడని తెలుస్తోంది. 

అన్నీ  అనుకున్నట్లుగా జరిగితే  మరో నెలలోపే ఈసినిమా ‘గబ్బర్ సింగ్ 2’ కి బదులుగా ఈ సినిమానే మొదట సెట్స్‌కు వెళ్ళే ఛాన్సులున్నాయని సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే చివరి నిముషంలో పవన్ ఏ ట్విస్ట్ ఇస్తాడో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: