టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఫాంలో ఉన్న హీరో మహేష్ బాబు. మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ మూవీకి శ్రీమంతుడిగా పేరును ఖరారు చేసినట్టు తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా శ్రీమండుతు మూవీకిలోని ఓ పాట లీక్ అయిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంలో అసలు వ్యక్తిని చిత్రయూనిట్ పట్టేసుంది. అతనిపై ప్రిన్స్ సీరియస్ అయ్యాడంట. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం భారీ చిత్రాలకు శాపంగా మారిన లీకేజీ సమస్య, ఇప్పుడు శ్రీమంతుడు చిత్రాన్ని వేధిస్తోంది. ఇటీవలే బాహుబలి చిత్రం ఉదంతం మరచిపోకముందే... తాజా ఘటన సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది.

కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న శ్రీమంతుడు సినిమాలో, మహేశ్ బాబును మరదలు ఆటపట్టించే పాట లీక్ అవ్వడంతో ప్రస్తుతం సినిమా యూనిట్ మొత్తం అలెర్ట్ అయింది. ఈ లీకేజీ కారణంగా ఇప్పటివరకూ గోప్యంగా ఉంచిన ప్రిన్స్ కొత్త లుక్ రివీల్ అయిపోయింది. అయితే, లీకైన పాట బిట్ సింప్లీ సూపర్బ్ గా ఉండటంతో సినిమాపై మరింతగా ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

కానీ పాట లీక్ చేసింది ఎవరు అన్నదానిని చిత్రయూనిట్ వెంటనే కనుక్కుందట. శ్రీమంతుడు టెక్నికల్ టీంకి సంబంధించిన ఓ వ్యక్తి ఈ పని చేసినట్టుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కనుక్కుంది. అ వ్యక్తిని పిలిచి, ప్రిన్స్ క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా శ్రీమంతుడిగా మహేశ్ బాబు ప్రేక్షకులను ఎలా మెస్మరైజ్ చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: