తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి కెరీర్ తో ముందుకు సాగుతున్న అందాల రాశి కాజల్. ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అంత గుర్తింపు రాకపోయినా మగధీర సినిమాతో ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. అగ్ర హీరోల సరసన నటిస్తూ అటు తమిళంలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. మరి ఈ అమ్మడు టాలీవుడ్ కి చెందిన ఓ నిర్మాతపై కాజల్ అగర్వాల్ చాలా కోపంగా ఉంది.  దీనికి కారణం ఆ నిర్మాత అమ్మడిని పారితోషికం విషయంలో మోసం చేసాడని తెలుస్తోంది.


కాజల్ నటించిన మగధీర లో ఒక స్టిల్


అందుకే ఆ నిర్మాతపై కాజల్ కారాలు, మిరియాలు నూరుతోందట. ఆ నిర్మాత నిర్మించిన మూడు చిత్రాల్లో  కాజల్ అగర్వాల్ వరుసగా   నటించింది. ఈ మూడు సినిమాలకూ అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత, సినిమాలు పూర్తయినప్పటికీ పారితోషికం సెటిల్ చేయలేదట. ఓ సినిమా అయిపోగానే తన తదుపరి సినిమాలో కాజల్ ని హీరోయిన్ గా తీసుకోవడంతో అప్పుడు ఏమి అనలేక కమిట్ అయ్యింది. కానీ కమిట్ అయిన సినిమాకి అడ్వాన్స్ ఇచ్చి, ముందు సినిమా బ్యాలెన్స్ అమౌంట్ గురించి  ఏ మాత్రం ప్రస్తావించక పోవడంతో కాజల్ కి చిరాకు పుట్టిందట. తిక్కరేగిన కాజల్ తను నటించిన గత చిత్రం హీరో, ఆ సినిమా ఫైనాన్సియర్ ని కలిసి ఆ నిర్మాతపై ఫిర్యాదు చేయడమే కాకుండా, ఈ విషయాన్ని బయటపెట్టి అల్లరి చేస్తానని చెప్పిందట.


దాంతో ఆ సినిమాకి ఫైనాన్స్ ఇచ్చిన ఫైనాన్షియర్, హీరో కాజల్ అగర్వాల్ కి డబ్బులు సెటిల్ చేయిస్తామని మాట ఇచ్చారట. సక్సెస్ అని చెప్పుకుంటున్న సినిమాని అల్లరి పాలు చేయడం ఇష్టంలేకే ఫైనాన్షియర్, హీరో ఈ విషయంలో కలుగజేసుకుంటున్నారని తెలుస్తోంది.  మరి తనకు వచ్చే డబ్బుత్వరలో చెల్లించక పోతే టాలీవుడ్ లో పెద్ద టాపిక్ చేస్తానని కాజల్ వార్నింగ్ కూడా ఇచ్చిందట.


మరింత సమాచారం తెలుసుకోండి: