తెలుగు ఇండస్ట్రీలో పెద్దోళ్ల గొడవలు తారాస్థాయికి చేరాయి. దీనికి వేధిక ‘మా’ మూవి అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్, జయసుధ పోటీకి నిలిచారు. వీళ్ల విషయం పక్కకు పెడితే వీరి వెనుక ఉన్నవారితో సైలెంట్ యుద్దాలు జరుగుతున్నాయి. అవి తారాస్థాయికి చేరి నిన్న సోషల్ మీడియాలో ఎవరికి వారే ఎమునా తీరే అన్న చందంగా చర్చలు ప్రెస్ మీట్ లు జరిగాయి.


సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతున్న దాసరి నారాయణ రావు


ఇక విషయానికి వస్తే మొన్నామధ్య సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్లో దాసరి నారాయణ రావు  చేసిన వ్యాఖ్యలు మెగా క్యాంపులో ఆగ్రహ జ్వాలలు రగిల్చాయి. అయితే అప్పుడే దాసరి ఆ వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చాడు. ఇటీవల రామ్ చరణ్ ఫేస్ బుక్ ద్వారా దాసరిపై సెటైర్లు విసిరారు. నేనేం తక్కువ తనలేదని బన్నికూడా కౌంటర్ ఇచ్చాడు. మెగా కుటుంబం దాసరిపై ఈ రేంజిలో దండయాత్ర చేయడానికి కారణం ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తరువాత ఆ స్థాయిలో పరిశ్రమలో గొప్ప గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి చిరంజీవి ఇది జగమెరిగిన సత్యం. అయితే దాసరి చిరంజీవి పేరు చెప్పకుండా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత పవన్ కళ్యాణ్ మాత్రమే అంటూ చేసిన వ్యాఖ్యలు మెగా క్యాంప్ ఆగ్రహానికి కారణమయినట్లు తెలుస్తోంది.


రుద్రమదేవి ఆడియో ఫంక్షన్లో బన్ని మాట్లాడుతున్న దృశ్యం


దీనికి కౌంటర్ గా బన్నీ రుద్రమదేవి సినిమా ఆడియో ఫంక్షన్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మన చరిత్ర ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుండి వచ్చాం అనేది మర్చిపోనేకూడదు. నాకూ ఓ చరిత్ర ఉంది. దాని పేరు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ ఎండలో నిలబడితే, మేమందరం ఆయన నీడలో పెరిగాం. ఎవరి తరువాత ఎవరు అనే ప్రశ్న వస్తే నాకు మాత్రం చిరంజీవి తరువాతే ఎవరైనా అంటూ సూటిగా చెప్పాడు. అంతే కాదు చిరంజీవి అల్లు అర్జున్‌కి చెప్పిన మాటలు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: