స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కి విడుదలకు సిద్దమవుతున్న సినిమా ‘సన్నాఫ్‌ సత్యమూర్తి'. అయితే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ రోజున ఏప్రిల్ 2న విడుదల చేయాలని నిశ్చయించినా మెగా మేనల్లుడు సాయిధర్మతేజ్ సినిమా రేయ్ సినిమా రేపు విడుదల కానున్నది. దీని కోసం వైవీఎస్ చౌదరి విజ్ఞప్తి మేరకు ఆయన మీద గౌరవం కొద్ది సినిమాను పోస్టు పోన్ చేశారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు కాస్త బాదపడ్డ మెగ అబ్బాయి కోసం త్యాగం చేశారని కాస్త ఊరట చెందారు. అయితే  తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ అఫీషియల్ గా ఖరారైంది. ఏప్రిల్ 9న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలకు ఉన్న భారీ ఆదరణ నేపథ్యంలో సినిమాను అత్యధిక సంఖ్యలో థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


త్రివిక్రమ్ శ్రీనివాస్ సూచనలు శ్రద్దగా వింటున్న అల్లు అర్జున్


చిత్రంలో త్రివిక్రమ్ తన మార్క్ చాలా పర్ఫెక్ట్ గా చూపించారని తెలియవచ్చింది. అంటే  చిత్రంలో దాదాపు 25 నిముషాల క్లైమాక్స్ ఉండబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్ సినిమాలో హైలెట్ అని చెప్తున్నారు. అల్లు అర్జున్ ఫన్నీ యాక్షన్ రెండు చాలా బాగా పండించ గలడు.  ఫస్టాఫ్ ...ఫన్ తో గడిచిపోయి..ఇంటర్వెల్ కు సీరియస్ మోడ్ లోకి వెళ్లినా..సెకండాఫ్ మాత్రం కొత్త మలుపులతో సాగుతుందంటున్నారు. పూర్తిగా వన్ లైనర్స్ తో ఈ క్లైమాక్స్ సాగుతుందని, తండ్రీ కొడుకుల మధ్య సాగే  హై ఎమోషనల్ సెటప్ లో  చాలా ఇంటెన్స్ గా ఈ క్లైమాక్స్ ఉండబోతోందని చెప్పుకుంటున్నారు.ఇదే ఎపిసోడ్ లోనే యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటుందని, అది మైండ్ బ్లోయింగ్ అని ఫిల్మ్ నగర్ వర్గాల సమచారం

మరింత సమాచారం తెలుసుకోండి: