ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు టాప్ పొజిషన్ లో ఉన్నారు అంటే, కచ్ఛితంగా చెప్పలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బిజిగా ఉన్న ఆర్టిస్టులే. ఒక్క హీరో,హీరోయిన్స్ అంటూ తేడా లేకుండా అందరూ ఈ మధ్య కాలంలో ఫుల్ బిజిగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే శ్రుతి హాసన్ తీసుకున్న నిర్ణయానికి నాగార్జున షాక్ అయినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి.


మల్టీ స్టారర్ సినిమా


వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాల హవా మొదలైంది. కింగ్ నాగార్జున – తమిళ హీరో కార్తీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా కూడా ఇటీవలే ప్రారంభమైంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో శృతి హాసన్ ని హీరోయిన్ గా ఎంచుకున్నారు. కానీ కోలీవుడ్ లో వినిపిస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం శృతి హాసన్ ఈ సినిమా నుంచి తప్పుకోనుందని అంటున్నారు.


శ్రుతిహాసన్ రియాక్షన్స్


శృతి హాసన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి మెయిన్ రీజన్ శ్రుతి హాసన్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే అని అంటున్నారు. అయితే నిజానికి శ్రుతిహాసన్ కి డేట్స్ ఉన్నప్పటికీ, ఈ మల్టీస్టారర్ మూవీలో నటించే ఆసక్తి లేదని క్లియర్ గా చెప్పుకొచ్చిందట. దీనికి సంబంధించి నాగార్జున సైతం, శ్రుతిహాసన్ ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా, శ్రుతిహాసన్ నుండి రియాక్షన్స్ రాకపోడంతో నాగార్జున కొద్దిగా  ఇబ్బందిపడినట్టు తెలుస్తుంది.


శ్రుతి హాసన్ అప్ కమింగ్ మూవీస్

దీంతో చిత్ర యూనిట్ మరో హీరోయిన్ ని వెతికే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం శ్రుతిహాసన్, మహేష్ బాబు శ్రీ మంతుడు, విజయ్ పులి సినిమాకి ఎక్కువ బల్క్ డేట్స్ ఇవ్వడం, గబ్బర్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.  ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: