నందమూరి వంశీయులకు ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. మహానటుడు నటసార్వభౌముడు ఎన్టీఆర్ వారసత్వం నుంచి వచ్చిన నటుడు బాలకృష్ణ. బాలకృష్ణ మొదట్లో మాస్ సినిమాలు చేసినప్పటికి తర్వాత ఫ్యాక్షన్ బ్యాగ్ గ్రౌండ్ లో వచ్చిన సినిమాలకు మంచి క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ఇలాంటి సినిమాలకు ఎక్కువ ప్రియార్టీ ఇస్తున్నాడు. అయితే ఈ మద్య ఆయన తాత కూడా అయ్యారు. మరి నందమూరి నటసింహం బాలకృష్ణ 98వ చిత్రంగా రూపొందుతోన్న ‘లయన్’ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య 99వ చిత్రం శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందనున్నట్టు తెలిసింది.  ఈ సినిమా స్ర్కిఫ్ట్ రెడీ అయిపోయిందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుంది.  


బాలకృష్ణ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన పోస్టర్ 

 

బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తమిళంలో భారీ బడ్జెట్ చిత్రాలైన ‘మాట్రాన్’, ‘కోచడయాన్’, ‘లింగ’, ‘కత్తి’ చిత్రాలకు భాగస్వాములుగా వ్యవహరించడంతో పాటు పంపిణీ కూడా చేసారు. తెలుగులో మహేష్ బాబు నటించిన  ‘1’, ‘ఆగడు’ చిత్రాలను పంపిణీ చేసారు. ఈ సంస్థ తాజాగా బాలయ్య 99వ సినిమాని నిర్మించబోతోంది. భారీ వ్యయంతో అన్ని హంగులు ఆర్భాటతో చాలా రిచ్ గా తీయబోతున్నట్లు తెలిసింది.  త్వరలో ఆరంభంకానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించాలనుకుంటోందట ఈరోస్ ఇంటర్నేషనల్. ఇందులో బాలకృష్ణ సరసన నయనతార కథానాయికగా నటించనుందని సమాచారమ్. ఇక ఈ చిత్రానికి ‘డిక్టేటర్’ టైటిల్ ని ఫిక్స్ చేసారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: