మెగా స్టార్ చిరంజీవి తనయునిగా వెండితెరకు పరిచయం అయిన రాంచరణ్ ముద్దుగా చెర్రి అంటారు. చిరుత సినిమాతో మంచి ఇమేజ్ సంపాదించుకున్న చరణ్ మగధీర సినిమాతో పూర్తి స్థాయిన నటనా ప్రదర్శన తో అగ్ర హీరోల్లో ఒకడయ్యాడు. తీసినవి కొన్ని సినిమాలే అయినా చెర్రి తన కంటూ ప్రత్యేక ఇమేజ్ ఫాలోయింగ్ అభిమాన్లు మంచి స్థానం సంపాదించుకున్నాడు. కృష్ణ వంశి దర్శకత్వంలో మంచి కుటుంబ చిత్రంగా రూపొందించి ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాతో ఫ్యామిలీ హీరో కూడా అయ్యాడు. కానీ ఈ సినిమా మిశ్రమ ఫలితాలే ఇచ్చింది. ఈ సినిమా తర్వాత చరణ్ ఇంటి సమక్షంలోనే ఎక్కువ గడుపుతున్నాడు. అంతే కాదు తన 30 వ పుట్టిన రోజు కూడా కుటుంబ సభ్యులతోనే చేసుకున్నాడు.
తాజాగా శ్రీను వైట్ల తీయబోయే సినిమా కు ఒప్పుకున్నాడు. మాస్,
యాక్షన్, సెంటిమెంట్ ఉన్న ఈ చిత్ర కథ చరణ్ కి బాగా నచ్చిందంట. అంతే కాదు శ్రీను
వైట్ల గతంలో కోన వెంకట్, గోపి మోహన్ లతో వివాదాలు వచ్చి విడిపోయిన వార్త అందరికీ
తెలుసు కానీ ఈ ప్రాజెక్ట్ కోసం కోనా వెంకట్, గోపీ మోహన్ లను శీనుతో కలిపాడు. సినిమాలో చరణ్ పాత్ర
ప్రదానకార్షణగా నిలుస్తుందని సమాచారం. ప్రస్తుతానికి ఈ సినిమాకు
ఇంకా టైటిల్ ని ఖరారు చెయ్యలేదు. ఏప్రిల్ 2 నుండి షూటింగ్ ప్రారంభంకానుంది. రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.
డి.వి.వి దానయ్య నిర్మాత.