పివిపి నిర్మాణ సంస్థ తీస్తున్న  మల్టీ స్టారర్ నుండి  శ్రుతిహాసన్ తప్పుకున్న వ్యవహారం పై శ్రుతి పై క్రిమినల్ కేసుల వరకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే  ఇంత వ్యవహారం జరుగుతున్నా శ్రుతి ఏ మాత్రం భయపడటం లేదని వార్తలు వస్తున్నాయి.  శ్రుతిహాసన్ సెక్రటరి ఈ విషయం పై మీడియా ప్రశ్నిస్తున్నా సమాధానo చెప్పకుండా ఇటువంటి వ్యవహారాలన్నీ సర్వసాధారణం అని చాలతేలికగా తీసివేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈరగడ తమన్నాకు అదృష్టంగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో  వినిపిస్తున్న సమాచారం ప్రకారం శ్రుతిహాసన్ స్థానంలో నాగార్జున, కార్తి లు నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమాలో తమన్నా ఎంపిక అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం  సరైన  అవకాశాలు లేని తమన్నాకు ఇది  ఊహించని అదృష్టం.

ఈవార్తలు ఇలా ఉండగా శ్రుతిహాసన్ వ్యవహారం మరో మలుపు తీసుకోబోతోంది. పివిపి నిర్మాణ సంస్థ టాలీవుడ్ ప్రొడ్యూసర్  కొన్సిల్ కు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు  కూడా శ్రుతి వ్యవహారశైలి పై కంప్లయింట్ ఇవ్వడంతో శ్రుతిహాసన్ పై చర్యలు తీసుకునే  విధంగా టాలీవుడ్ నిర్మాతల మండలి ఆలోచనలు చేస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఎలా చూసినా శ్రుతి వివాదాలు తమన్నాకు  అదృష్టంగా మారింది..



మరింత సమాచారం తెలుసుకోండి: