‘మా’ సంస్థ ఎన్నికలు పూర్తి అయిపోయినా ఆ ఎన్నికలు మిగిల్చిన రగడకు సంబంధించిన వార్తలు  ఇంకా హడావిడి చేస్తూనే ఉన్నాయి . నటుడు శివాజీరాజ తన పై మితిమీరి చేసిన కామెంట్ల పై  కోపగించుకున్న హేమ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా ఈ విషయం దాసరి దృష్టి వరకు  తీసుకు వెళ్ళిందట.

అంతేకాదు మహిళల పై ఇలాంటి వ్యాఖ్యలు ఏమిటి అవసరం అనుకుంటే ఈ విషయమై  చిరంజీవితో మాట్లాడుతానని, ఇంకా అవసరం అనుకుంటే పవన్‌కళ్యాణ్ ఇంటికెళ్లి కూర్చుంటానని హేమ కామెంట్ చేసినట్లుగా వార్తలు  వస్తున్నాయి. ఎన్నికల అనంతరం సమస్య పరిష్కరిద్దామని దాసరి హేమకు  చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలు ఇలా ఉండగా హేమ నాగబాబు పై  చేసిన కామెంట్స్ కు మెగా అభిమానులు  చాల కోపంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ‘మా' సంస్థ ఎన్నికలకు పోలైన తక్కువ ఓట్ల పై ఒక ప్రముఖ ఛానల్ కామెంట్ చేస్తూ ఇంటి పక్కన ఉన్న ‘మా’ సంస్థకు  ఓటు వేయడానికి ఖాళీ లేని హీరోలు పేద కళాకారులకోసం సేవ చేస్తారా ? అని ప్రశ్నిస్తూ నిన్న రాత్రి ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: