పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా హీరో రోల్ చేసి చాలా గ్యాప్ వచ్చింది. 2013లో అత్తారింటికి దారేది చిత్రం తర్వాత పవన్ కల్యాణ్  కేవలం ఒక అతిథి పాత్రలో మాత్రమే‘గోపాల గోపాల’ సినిమాలో నటించాడు. అది తప్ప ఇప్పటి వరకూ తను అనౌన్స్ చేసిన గబ్బర్ సింగ్2 మూవీ ఇంకా స్టార్ట్ చేయలేకపోతున్నాడు.

అయితే ఎట్టకేలకు ఈ మూవీకి సంబంధించిన అఫిషియల్ అప్ డేట్స్ త్వరలోనే మొదలుకానున్నాయి. వివరాల్లోకి వెళితే, సూపర్ హిట్ ‘గబ్బర్ సింగ్’‌కు సీక్వెల్‌గా గబ్బర్ సింగ్ 2ను అనౌన్స్ చేసినా ఆ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ’గబ్బర్ సింగ్ 2’ సెట్స్‌ పైకి వెళ్ళడం కంటే ముందుగానే, దర్శకులు మాత్రం మారుతూ వస్తుండడం విశేషం.  

‘పవర్’ సినిమా ద్వారా హిట్‌ కొట్టిన బాబీని దర్శకుడిగా ఫైనల్ చేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఓ పెద్ద హీరో మూవీకి డైరెక్టర్ మార్పు అనేది జరిగితే అది గబ్బర్ సింగ్2 మూవీనే అని  చెప్పవచ్చు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయట.

ఏప్రిల్ చివరి వారంలో కానీ, మే మొదటి వారంలో సినిమా సెట్స్‌పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం దాదాపు 3 నెలలు గబ్బర్ సింగ్2 మూవీకి సంబంధించిన బల్క్ కాల్షీట్స్ ఇచ్చాడని క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: