బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి తక్కువుగా ప్రయోగాలు జరుగుతుంటాయి. అటువంటి సమయంలో ముందుగా నటించటానికి బయటకు వచ్చేది సీనియర్ యాక్టర్సే. అలాంటి వారిలో విద్యాబాలన్ ఒకరు. మంచి కథ దొరికితే అందులో నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదు అని విద్యాబాలన్ ఎప్పుడో స్టేట్ మెంట్ ఇచ్చింది. తాజాగా తను ట్రిపికల్ రోల్ ని సెలక్ట్ చేసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

ఇక వివరాల్లోకి వెళితే, బాలీవుడ్‌ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా విద్యాబాలన్ స్టార్ డంని సంపాదించుకుంది. పెళ్లి తర్వాత సినిమాల వేగాన్ని తగ్గించింది ఈ బ్యూటీ. కేవలం యాక్టింగ్ స్కోప్ ఉన్న చిత్రాలలోనే నటించటానికి ఆసక్తి చూపుతుంది.ఎందుకు మూవీలను తగ్గించారని ఎవరైన తనని అడిగితే “మనసుకు నచ్చిన కథతో ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాను” అని కచ్ఛితంగా చెబుతుంది.

సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించాలన్న ఆలోచనే అందుకు కారణం అంటుంది. అయితే ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో విద్యాబాలన్ ఓ మూవీలో నటించనుందనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఇందులో విద్యాబాలన్ మానసిక రోగిలా ప్రవర్తించే పాత్రలో నటించనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

మంచి కథ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను, తను ఎదురుచూస్తున్నట్టుగానే ఈ ఆఫర్ తనని వరించినందుకు హ్యాపీగా ఉందని తన సన్నిహితుల వద్ద విద్యాబాలన్ చెప్పుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: