పవన్ కళ్యాన్ గబ్బర్ సింగ్ తర్వాత సోలోగా హీరోగా ఇప్పటి వరకు తెరపై కనబడలేదు. తర్వాత మల్టీ స్టారర్ సినిమా అయిన గోపాల గోపాల సినిమాతో అందరి మనసు దోచేశాడు. ఈ సినిమాలో వెంకటేశ్, పవన్ కళ్యాన్ లు నటించినప్పటికీ పవన్ కే కాస్త పేరొచ్చింది. పవన్ ప్రజా సేవ చేయాలనే ధృఢ సంకల్పంతో జన సేన అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ మధ్య పార్టీ విషయల్లో కూడా కాస్త బిజి బిజిగా కనబడుతున్నాడు.

గబ్బర్ సింగ్ పోస్టర్


దాసరినారాయణ రావు తీస్తున్న సినిమా పవన్ కళ్యాన్ ఒకే చెప్పడం. తర్వాత త్రివిక్రం తో సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఇవన్నీ జరగడానికి కాస్త టైమ్ పట్టేట్టు ఉందట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మన అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘గబ్బర్ సింగ్ 2’ వస్తుందని ఎప్పటి నుంచో మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ పైకి మాత్రం రాలేదు. అయితే ఈ సినిమాని పవర్ ఫేమ్ బాబీ డైరెక్ట్ చేయనున్నాడు. అయితే బాబీ కూడా ప్రాజెక్ట్ నుండి సైడయ్యాడని వార్తలు వినపడ్డాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని ‘గబ్బర్ సింగ్ 2′ సినిమా ఏప్రిల్ లాస్ట్ వీక్ లేదా మే ఫస్ట్ వీక్ నుండి సెట్స్ పైకి వెళుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి పవన్ సినిమా పూర్తి చేసుకొని ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందు కు వస్తాడా..? రాడా అన్నది వేచి చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: