తెలుగు చలన చిత్ర రంగాన్ని తన సంగీతం తో ఉర్రూతలూగిస్తున్నా రాక్ అండ్ రోల్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్. చిన్న వయసులోనే మంచి మ్యుజీషన్ గా పేరు సంపాదించుకున్న దేవి ఇప్పటి వరకు అన్ని సూపర్ హిట్ సాంగ్స్ అందించాడు. సినిమా అడినా ఆడక పోయినా మనోడు మ్యూజిక్ మాత్రం సూపర్ హిట్ అయి తీరాల్సిందే.. ఇక మెగా స్టార్ అల్లుడిగా వెండి తెరకు పరిచయం అయిన అల్లు అర్జున్ డ్యాన్స్ తో ఇరగదీస్తాడని అందరికీ తెలుసు. విరిద్దరి కాంబినేషన్ లో ఆర్య 2, జులాయిలో ఈ ఇద్దరిపై ఒక సాంగ్ పట్ కో పట్ కో అనే పాట హాలీవుడ్ రేంజ్ లో తీశారు. మళ్లీ రోసారి-బన్నీ-దేవిశ్రీ కలిసి చిందేయనున్న ఈ పాటకు సంబందించి షూట్ కూడా పూర్తయింది.. రేపే ఈ ప్రమోషనల్ సాంగ్ విడుదల చేయబోతున్నారు... ఈ విషయాన్ని ధృవీకరిస్తూ... ఓ టీజర్ కూడా విడుదల చేశారు. కాంబినేషన్ తో పాటు ప్రమోషన్ విషయంలోనూ 'జులాయి'నే ఫాలో అవుతున్న సన్ ఆఫ్ సత్యమూర్తి అదే రేంజి హిట్ ని కొడతారని అంచనాలు వేస్తున్నారు.


దేవీశ్రీ ప్రసాద్, అల్లు అర్జున్


అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ రూపొందించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధమైంది.

ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ పొందిన ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, ఆదాశర్మ కథానాయికలుగా నటించారు. నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ త్రివిక్రమ్-అల్లు అర్జున్ మేలుకలయికలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఇప్పటికే సూపర్‌హిట్ అయ్యాయన్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: