నిన్న సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్  ఎంట్రీ  ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కృష్ణ అభిమానులు సూపర్  స్టార్ ఇంటి వద్ద భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమంలో కృష్ణ అభిమానులు హడావిడి చేయడమే కాకుండా విపరీతంగా బాణసంచా కాల్చి దీపావళి పండుగ వచ్చిందా అని అనిపించేడట్లుగా చేసారు.

అంతేకాకుండా దీనికి తోడు  అనేక ఛానల్స్ సూపర్ స్టార్ కృష్ణ పై ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేసాయి. అయితే కృష్ణ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో మహేష్ బాబు కనిపించక పోవడం సూపర్ స్టార్ అభిమానులను నిరాశ పరిచినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

టాలీవుడ్ లోని అనేకమంది సెలిబ్రెటీలు తమ ట్విటర్లలో సూపర్ స్టార్ కృష్ణకు అభినందనలు తెలియచేస్తూ ఉంటే కనీసం తన ట్విటర్ ద్వారా కూడ మహేష్ తన తండ్రి  కృష్ణకు అభినందనలు తెలియచేయకుండా మౌనంగా ఉండటం చాలామంది కృష్ణ అభిమానులను ఆశ్చర్య పరిచింది. 

కృష్ణ పుట్టినరోజును సెంటిమెంట్ గా చేసుకుని తన సినిమాల టీజర్లు విడుదల చేసే మహేష్ ఎంతో ప్రాముఖ్యత ఉన్న నిన్నటిరోజున మౌనంగా ఉండటం ఏమిటి అని కృష్ణ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మహేష్ తో పాటు తన సినిమాలకు కృష్ణ టైటిల్స్ గా పెట్టుకుని హడావిడి చేసే కృష్ణ  అల్లుడు మరియు యంగ్ హీరో సుధీర్ బాబు కూడ ఈ కార్యక్రమంలో లేకపోవడం కృష్ణ అభిమానులకు హాట్ న్యూస్ గా మారింది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: