ఈరోజు ఉదయం ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ పతాక శీర్షికలో ప్రచురించిన ఒక ప్రధాన వార్త జూనియర్ తో పాటు జూనియర్ అభిమానులను కూడా తీవ్ర గందరగోళంలో పడేసింది. తెలుగు దేశంతో జూనియర్ కు ఉన్న సంబంధ బాంధవ్యాలు నేటితో పూర్తిగా తెగిపోయాయని జూనియర్ సభ్యత్వాన్ని కూడా తెలుగుదేశం పార్టీలో రెన్యువల్ చేయడానికి చాలామంది వ్యతిరేకిస్తూ జూనియర్ ను ‘డౌట్ ఫుల్ స్టార్’ గా పరిగణిస్తూ నిర్ణయం తీసుకొబోతున్నారని, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి సినిమా హీరోలు అవసరం లేదని నిర్ణయించు కున్నారు అంటూ ఒక షాకింగ్ న్యూస్ ప్రచురించింది.

గత సంవత్సరం జరిగిన ఎన్నికలలో ప్రచారానికి రమ్మని వందలాది ఫోన్ కాల్స్ చేసినా స్పందించని జూనియర్ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తెలుగుదేశం పార్టీ  తీసుకుందని తెలియచేస్తూ ఈరోజు ఈ సమస్యను చర్చించడానికి నారా లోకేష్ తెలుగుదేశం కార్యకర్తలతో ఒక ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేసాడు అంటూ షాకింగ్ న్యూస్ ప్రచురించి అందర్నీ ఖంగారు  పెట్టింది.

అయితే ఈ వార్త చివర ఈరోజు ఏప్రియల్ 1 అని మరిచిపోయారా అంటూ సెటైర్ వేసి ఈరోజు ఉదయాన్నే జూనియర్ తో పాటుగా జూనియర్ అభిమానులను కూడా తన వార్తతో ఏప్రియల్  ఫూల్ చేసింది ఆ ప్రముఖ దిన పత్రిక..  


మరింత సమాచారం తెలుసుకోండి: