అల్లు అర్జున్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రూపొందిన ‘ సన్నాఫ్ సత్యమూర్తి’ సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకోవడంతో ఈ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలు అయింది. ఈ సినిమా బన్నీ కెరియర్ లో 60 కోట్లు వసూలు చేసే తొలి సినిమాగా రికార్డులు క్రియేట్ చేస్తుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ సినిమా నిడివికి సంబంధించి వస్తున్న వార్తలు అల్లుఅర్జున్ ను కలవర పెడుతున్నాయని వార్తలు వస్తున్నాయి.
ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలు ఉంటుంది అనే వార్తలు వస్తున్నాయి. అయితే మారిన ప్రస్తుత పరిస్థితులలో 2 గంటల 20 నిమిషాలు దాటి సినిమా ఉంటే ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతున్న నేపధ్యంలో ఇంత నిడివితో ఉన్న తన సినిమాను భారంగా తన అభిమానులే ఫీల్ అవుతారా? అని అల్లుఅర్జున్ టెన్షన్ పడుతున్నట్లు టాక్.
ఇదే విషయాన్ని బన్నీ ఈ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ దగ్గర షేర్ చేసుకుంటే తాను తీసిన ‘అత్తారింటికి దారేది’ 2 గంటల 49 నిముషాలు ఉన్నా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కదా అని త్రివిక్రమ్ బన్నీతో సెటైర్ వేసినట్లు టాక్. కాని పవన్ ఎంత సేపు వెండితెర పై కనిపించినా పవన్ అభిమానులకు బోరు కొట్టదు సరికదా అది పండుగ. మరి ఆ రేంజ్ లో ఇంత భారీ నిడివితో ఉన్న బన్నీ సినిమాను ఆ స్థాయిలో ఆదరిస్తారా అన్న విషయం ఈనెల 9న తేలిపోతుంది..