స్టార్ డైరెక్టర్ రాజమౌళిని టార్గెట్ చేస్తూ ఒక స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది అనే వార్తలు ఫిలింనగర్ లో  సంచలనాన్ని రేపుతోంది. టాలీవుడ్, కోలీవుడ్ లలో అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఒక ప్రముఖ హీరోయిన్ తన స్నేహితుల వద్ద ఈ కామెంట్స్ చేసినట్లుగా  గాసిప్పులు వస్తున్నాయి. 

ఫిలింనగర్ లో వస్తున్న వార్తల ప్రకారం ఆ స్టార్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యల సారాంశం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. రాజమౌళి దగ్గర సినిమా చేయడం అంటే  రెండు నుంచి  మూడేళ్ళ సమయం పడుతుందని అంతేకాకుండా ఒళ్ళు హూనం చేసుకుని నటించాలని ఆ తరువాత పడిన కష్టానికి  ప్రతి ఫలం ఆ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్స్ కన్నా రాజమౌళికే ఎక్కువ దక్కుతుంది అని కామెంట్ చేస్తూ, ఇవన్నీ లెక్కలు చూసుకుని  రాజమౌళి సినిమా ఒప్పుకోవాలి అని అంటూ ఆ  హీరోయిన్ కామెంట్ చేసినట్లు  టాక్.

రాజమౌళి సినిమాలు కన్నా త్రివిక్రమ్ సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా చేసినా పేరుతో పాటు యూత్ కు, ఫ్యామిలీ ఆడియన్స్ కు  దగ్గర అవ్వచ్చని చెపుతూ రాజమౌళితో కంటే త్రివిక్రమ్‌తో పని చేయడం బెస్ట్‌ అని ఆ స్టార్ హీరోయిన్ కామెంట్ చేసినట్లు టాక్. త్రివిక్రమ్ లేటెస్ట్ గా తీసిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాకు వస్తున్న క్రేజ్ ను చూసి ఆ స్టార్ హీరోయిన్ ఈ కామెంట్లు చేసినట్లు టాక్. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరూ అన్న విషయం పై టాలీవుడ్ లో  రకరకాల హీరోయిన్స్ పేర్లు వినపడుతున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: