తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ తమిళుల ఆరాధ్య నటుడు. ప్రపంచ వ్యాప్తంగా ఈయనకు సినిమా పరంగా గుర్తింపు ఉంది. జపాన్, చైనా లో కూడా ఈయన సినిమాలు సూపర్ గా ఆడాయంటే ఏ రేంజ్ లో అక్కడ కూడా పాపులారిటీ సంపాదించాడు. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే ఈ మధ్య రజినీ కాంత్ సినిమాలు అంతగా ఆడటం లేదు. రజనీ రెండో కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించిన ‘కోచడయాన్’ వీళ్లని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. దాన్ని పరిష్కరించుకున్న వెంటనే తన భార్య లత, కుమార్తె సౌందర్యలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారం ఈ సూపర్ స్టార్ కి తలనొప్పి అయ్యి కూర్చుంది. ఈ ఆర్థిక లావాదేవీలు తమిళ నాట ఆయన ఇమేజ్ కి కొంత డ్యామెజ్ తెచ్చిపెట్టాయి. ఇంతలో ‘లింగా’ సినిమ త్వర త్వరగా పూర్తి చేశారు. కానీ అది బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం అయ్యింది. రజినీపై ఎంతో నమ్మకం ఉంచి తీసిన సినిమా లింగా అది కూడా ఫెయిల్ కావడం ఆయను బాధకు గురి చేసింది.   ‘లింగా’ నష్టం ద్వారా పంపిణదారుల ఆగ్రహానికి గురి కావల్సి వచ్చింది. దీన్నికూడా పరిష్కరించుకుందామని దాదాపు 10 కోట్ల రూపాయలు ఇచ్చారు రజనీ. ఇప్పుడా డబ్బుని పంచుకునే విషయంలో పంపిణీదారులు గొడవపడుతున్నారట. ఈ విషయం తెలిసి రజనీ చాలా అప్ సెట్ అయ్యారని సమాచారం. 


గతంలో రజినీకాంత్ హిమాలయాలను సందర్శించినప్పటి దృశ్యం

Click to view full size image

ఇప్పట్ల సినిమా గొడవలు ఏం పెట్టుకోకుండా ఓ నిర్ణయానికి వచ్చారట రజినీకాంత్. అదే హిమాలయాల్లోకి వెళ్లి రెస్టు తీసుకోవాలని. గతంలో ‘బాబా’ సినిమా తీసే టైం లో కూడా హిమాలయాలకు వెళ్లి వచ్చిన రజినీకాంత్ ఇప్పుడు అదే ఆలోచనలో ఉన్నాడని తెలిసింది.  కాస్త రిలాక్సేషన్ కోసం ఇప్పటికిప్పుడు హిమాలయాలు వెళ్లాలని ఫిక్సయ్యారట. అక్కడ కొన్నాళ్లు ధ్యానం చేసుకుని, ఆ తర్వాత రావాలని నిర్ణయించుకున్నారట.


హిమాలయాల్లో కొండ గుహల మధ్య ధ్యానం చేస్తున్న రజినీకాంత్




మరింత సమాచారం తెలుసుకోండి: