మెగా స్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ తో కలిసి దుబాయ్ లో హడావిడి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అటు రాజకీయాలలోనూ ఇటు సినిమా రంగంలోనూ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న చిరంజీవి  దుబాయ్ లో ఒక వారం రోజుల పాటు షాపింగ్ చేస్తూ బిజీగా గడిపి  సమ్మర్ రాకుండానే వెకేషన్ ఎంజాయ్ చేసి వచ్చాడని తెలుస్తోంది.

దుబాయ్ లోని మంచి మంచి టూరిస్టు స్పాట్ లతో పాటుగా మంచి షాపింగ్ స్పాట్స్ కు కూడా వెళ్ళి తన 150వ సినిమా గురించి తన కొడుకు రామ్ చరణ్ తో రకరకాల ఆలోచనలు చేసి మంచి ఎనర్జీతో తిరిగి భాగ్యనగరం వచ్చేసాడని తెలుస్తోంది.

ఒక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి జీవం పోయడానికి కాంగ్రెస్ నాయకులు  అంతా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయమై ఉద్యమాలు చేస్తూ ఉంటే అవేమి పట్టనట్లు చిరంజీవి తన కుటుంబ సభ్యులతో దుబాయ్ లో ఎంజాయ్ చేస్తూ తన కుటుంబంతో సరదాగా గడిపి  రావడం కాంగ్రెస్ పార్టీలో చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.

చిరంజీవి ప్రస్తుత వ్యవహార శైలిని బట్టి చిరూ ఇక రాజకీయాలకు శాస్వితంగా బైబై చెప్పినట్లే అనే విశ్లేషణలు కూడ వినపడుతున్నాయి. కనీసం చిరంజీవి తన 150వ సినిమా విషయంలో అయినా మాట నిలుపుకుంటాడో లేదో చూడాలి మరి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: