నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'దోచేయ్‌' సినిమా పై ఒక ఆశక్తికర వార్త  ఫిలింనగర్ లో హడావిడి   చేస్తోంది. ఈ నెల 24న విడుదల  కాబోతున్న ఈసినిమా పై  ఇప్పటికే  ఫిలింనగర్ లో ప్రీ రిలీజ్  పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాపై  లేటెస్ట్ గా వస్తున్న వార్తలు అందరికీ షాక్  ఇస్తున్నాయి.

సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో  నాగచైతన్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడంటూ వార్తల హడావిడి జరుగుతోంది. ఇది కేవలం గాసిప్పులు కాదు ఈ వార్తలకు కొంత అర్ధం ఉంది అని అంటున్నారు.  ఫిలింనగర్  వార్తలు బట్టి ‘దోచేయ్' టైటిల్‌లో ‘దో', ‘చేయ్' కలిపి రాసినా రెండింటికీ మధ్య తేడా వచ్చేలా అక్షరాల్లో రంగుల మార్పు స్పటంగా కనిపిస్తోంది,  కాబట్టి ఈ సినిమాలో   చైతన్య  రెండు  పాత్రలలో కనిపిస్తాడు అని  టాక్. 

‘చేయ్', ‘చైతూ' అనే ఈ రెండు మాటలు నాగచైతన్యను ముద్దుగా పిలిచే పేర్లు కాబట్టి ఆ రెండు పీర్లు  కలిసి  వచ్చేలా  ఈ  సినిమా  టైటిల్  పెట్టిన విషయం తెలిసిందే.  దీనికి తోడు ఈ సినిమా ట్రైలర్‌లో ‘ప్రతీ మోసం వెనుక ఇద్దరుంటారు. మోసం చేసేవాడు, మోసపోయేవాడు' అన్న డైలాగ్  ప్రకారం ఈసినిమాలో నాగ చైతన్య  రెండు పాత్రలలో కనిపించడం ఖాయం అని అంటున్నారు. ఈ  వార్తలే  నిజం అయితే  చైతు కెరియర్ లో  మొట్టమొదటిసారి ద్విపాత్రభినయం చేసిన సినిమాగా  ఈ సినిమా మిగిలి పోతుంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: