నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'దోచేయ్' సినిమా పై ఒక ఆశక్తికర వార్త ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. ఈ నెల 24న విడుదల కాబోతున్న ఈసినిమా పై ఇప్పటికే ఫిలింనగర్ లో ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా వస్తున్న వార్తలు అందరికీ షాక్ ఇస్తున్నాయి.
సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడంటూ వార్తల హడావిడి జరుగుతోంది. ఇది కేవలం గాసిప్పులు కాదు ఈ వార్తలకు కొంత అర్ధం ఉంది అని అంటున్నారు. ఫిలింనగర్ వార్తలు బట్టి ‘దోచేయ్' టైటిల్లో ‘దో', ‘చేయ్' కలిపి రాసినా రెండింటికీ మధ్య తేడా వచ్చేలా అక్షరాల్లో రంగుల మార్పు స్పటంగా కనిపిస్తోంది, కాబట్టి ఈ సినిమాలో చైతన్య రెండు పాత్రలలో కనిపిస్తాడు అని టాక్.
‘చేయ్', ‘చైతూ' అనే ఈ రెండు మాటలు నాగచైతన్యను ముద్దుగా పిలిచే పేర్లు కాబట్టి ఆ రెండు పీర్లు కలిసి వచ్చేలా ఈ సినిమా టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఈ సినిమా ట్రైలర్లో ‘ప్రతీ మోసం వెనుక ఇద్దరుంటారు. మోసం చేసేవాడు, మోసపోయేవాడు' అన్న డైలాగ్ ప్రకారం ఈసినిమాలో నాగ చైతన్య రెండు పాత్రలలో కనిపించడం ఖాయం అని అంటున్నారు. ఈ వార్తలే నిజం అయితే చైతు కెరియర్ లో మొట్టమొదటిసారి ద్విపాత్రభినయం చేసిన సినిమాగా ఈ సినిమా మిగిలి పోతుంది..