శేషాచలం ఆడవులలో జరిగిన ఎన్‌కౌంటర్‌ ప్రభావం నిన్న ఆల్లుఅర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా పై చూపెడితే నేడు ఏకంగా ‘లయన్’ సినిమాలో నటించిన త్రిషను తమిళులు బెదిరించే స్థాయికి వివాదాలు  ముదిరి పోయాయి. 

ఈ వార్తలు ఇలా ఉండగా గతవారం శేషాచలం అడవులలో ఈ ఎన్ కౌంటర్ జరిగినప్పుడు ఆ ప్రదేశానికి అతి దగ్గరలోనే శ్రుతిహాసన్  ఉన్నది అన్న వార్తలు వస్తున్నాయి. విజయ్ శ్రుతిహాసన్ ల ‘పులి’ షూటింగ్ శేషాచలం అడవులలో జరుగుతూ ఉండటంతో ఈ సినిమా యూనిట్ ఆ ఎన్ కౌంటర్ సంఘటన జరిగిన ప్రాంతానికి అతి దగ్గరలోనే ఉంది అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

అయితే  షూటింగ్ హడావిడిలో ఉన్న ఈ సినిమా యూనిట్ వారికి అసలు ఎన్ కౌంటర్ జరిగింది అన్న విషయమే తెలియక తమ షూటింగ్ ను కొనసాగించారట. అయితే  ఆ షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నప్పుడు పోలీసుల హడావిడితో  అసలు విషయం తెలుసుకున్న శ్రుతిహాసన్ షాక్ గురి అయిందని టాక్.

శిoబుదేవన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శ్రీదేవి, హన్సిక, సుదీప్ వంటి నటీనటులు కీలకమైన రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘కత్తి’ సూపర్ హిట్  తరువాత విజయ్ నటిస్తున్న  సినిమా ఇదే కావడంతో ఈ సినిమాకు సంబంధించి ఏ న్యూస్ వచ్చినా కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ అవుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: