ఇప్పటికే తమమధ్య జరుగుతున్న పోటీతో విపరీతమైన టెన్షన్ పడుతున్న మెగా హీరోల మధ్య చిచ్చు పెడుతున్న ‘బుల్లితెర’ ఫైట్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈవారం బుల్లితెర  పై ప్రసారం అవుతున్న వీకెండ్ సినిమాల ఫైట్ మెగా హీరోల మధ్య ఫైట్  గా తయారైంది. 

సాయి  ధరమ్ తేజ్ 'పిల్లా నువ్వు లేని జీవితం',వరుణ్ తేజ్  'ముకుంద' సినిమాలు ఒకే రోజు ఒకే టైమ్‌కి బుల్లితెర పై సందడి చేయబోతు ఉండటంతో ఈ రెండు  సినిమాల  మధ్య ఏ సినిమాకు మంచి టీఆర్‌పీ రేటింగ్స్ వస్తాయి అన్న విషయమై మెగా అభిమానులలో ఉత్కoఠ  పెరిగిపోతోంది. 

అయితే బుల్లితెర  ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని సాయి ధరమ్ తేజ్ 'పిల్లా నువ్వు లేని జీవితం' కంటే వరుణ్ తేజ్ 'ముకుంద' సినిమాకు ఎక్కువ రేటింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. దీనికి కారణం  బుల్లితెర ప్రేక్షకులు క్లాస్‌ మూవీస్‌కి గతంలో ఎక్కువ ఓటేసిన సందర్భాలను దృష్టిలో  పెట్టుకుని ఈ  విశ్లేషణలు చేస్తున్నారు. 

అయితే వీరిద్దరి సినిమాల మధ్య రవితేజ నటించిన ‘పవర్’ సినిమా కూడా మరో ఛానల్ లో ప్రసారం అవుతూ ఉండటంతో ఈ మెగా ఫైట్  లో ఏ హీరో సినిమాకు ఎక్కువ రేటింగ్స్ వస్తాయి అన్న అంచనాలలో బుల్లితెర టీఆర్‌పీ రేటింగ్‌ అనలిస్ట్స్‌ అంచనాలు కడుతున్నట్లు టాక్. మరి  మన బుల్లితెర ప్రేక్షకులు  ఈ వారం బుల్లితెర టాప్ హీరోగా ఎవరికీ పట్టం కడతారో చూద్దాం..



మరింత సమాచారం తెలుసుకోండి: