పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా స్టార్ డంని క్రియేట్ చేసుకున్న హీరో. ఈ హీరో నుండి ఎప్పుడు మూవీ వస్తుందా? అంటూ ఫ్యాన్స్ తో పాటు, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆసక్తి చూపుతుంది. సంవత్సరానికి, రెండు సంవత్సరాలకి ఒక మూవీగా చేసుకుంటూ వస్తున్న పవన్ కళ్యణ్ తో దర్శకుడిగా పనిచేయటం కోసం, ఇక టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ క్యూలోనే ఉన్నారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మేకర్స్ తో పాటు, ఫ్యాన్స్ ని నిరాశ పరిచే విధంగా ఓ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్2 మూవీకి సంబంధించిన పనుల్లో బిజిగా ఉన్నాడు.
ఈ మూవీ అనంతరం పి.వి.కె ప్రసాద్ బ్యానర్ లో ఓ మూవీ, అలాగే సురేష్ ప్రొడక్షన్స్ లో ఓ మూవీ ఉంటుందనేది ఇప్పటి వరకూ ఉన్న క్లారిటి న్యూస్. అయితే పవన్ కళ్యాణ్ వరుస మూవీలను ఒప్పుకోవడం, అవి అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడంతో, తను జీవిత ఆశయంగా పెట్టుకున్న రాజకీయ సేవకి ఇది అడ్డంకిగా ఉంది.
ఈ
విషయాలను ఆలోచించిన పవన్
కళ్యాణ్ గబ్బర్ సింగ్2
మూవీని
పూర్తి చేసి,
తరువాత
ఒప్పుకున్న మూవీలను క్యాన్సిల్
చేసుకునే ఆలోచనలో ఉన్నాడంట.
ఆ
విధంగానే ఇప్పటికే పి.వి.పి
సినిమా నుండి పవన్ తప్పుకున్నట్టు
టాలీవుడ్ టాక్స్ వినిపిస్తుంది.
ఈ
విధంగా చూస్తే పవన్ కళ్యాణ్
త్వరలోనే పూర్తి స్థాయి
రాజకీయాల్లో పాల్గొనచ్చని
అంటున్నారు.